ETV Bharat / state

అధికార పార్టీ నాయకుల వేధింపులతో మహిళ ఆత్మహత్యాయత్నం

Woman suicide attempt: ప్రశ్నిస్తే పగబడతాం అన్నట్లుగా ఉంది అధికార పార్టీ నాయకుల వ్యవహారం. ప్రశ్నించినందుకు ఓ మహిళ పై అధికార పార్టీ నేతలు, పోలీసులు కక్ష కట్టి రోజు వేధించడంతో మనస్తాపానికి గురై పురుగుల మందు తాగింది. ఈ ఘటన నంద్యాల జిల్లా పగిడ్యాల మండలం ప్రాతకోట గ్రామంలో జరిగింది.

author img

By

Published : Nov 25, 2022, 6:07 PM IST

మహిళ ఆత్మహత్యాయత్నం
మహిళ ఆత్మహత్యాయత్నం

Woman suicide attempt: నంద్యాల జిల్లా పగిడ్యాల మండలం ప్రాతకోట గ్రామంలో మంగమ్మ అనే మహిళ పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. ప్రాతకోట గ్రామానికి నందికొట్కూరు వైసీపీ ఇంచార్జ్ బైరెడ్డి సిద్దార్థ రెడ్డి రాగా.. మంగమ్మ ఇంటి పట్టా రాలేదని సిద్దార్థ రెడ్డిని అడగ్గా వైకాపా నాయకులు అడ్డుపడి దూషించారని భాదితురాలు తెలిపారు. మాకు ఇళ్ల పట్టాలు ఇవ్వడం లేదని బైరెడ్డి సిద్దార్థరెడ్డిని ప్రశ్నించినందుకు.. మాపై అధికార పార్టీ నేతలు, పోలీసులు కక్ష కట్టి రోజు వేధించడంతో మనస్తాపానికి గురై పురుగుల మందు తాగిందని,.. అధికార పార్టీ నేతలు, పోలీసులే కారణమని మంగమ్మ కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. మంగమ్మ ప్రస్తుతం కర్నూలు ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది.

Woman suicide attempt: నంద్యాల జిల్లా పగిడ్యాల మండలం ప్రాతకోట గ్రామంలో మంగమ్మ అనే మహిళ పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. ప్రాతకోట గ్రామానికి నందికొట్కూరు వైసీపీ ఇంచార్జ్ బైరెడ్డి సిద్దార్థ రెడ్డి రాగా.. మంగమ్మ ఇంటి పట్టా రాలేదని సిద్దార్థ రెడ్డిని అడగ్గా వైకాపా నాయకులు అడ్డుపడి దూషించారని భాదితురాలు తెలిపారు. మాకు ఇళ్ల పట్టాలు ఇవ్వడం లేదని బైరెడ్డి సిద్దార్థరెడ్డిని ప్రశ్నించినందుకు.. మాపై అధికార పార్టీ నేతలు, పోలీసులు కక్ష కట్టి రోజు వేధించడంతో మనస్తాపానికి గురై పురుగుల మందు తాగిందని,.. అధికార పార్టీ నేతలు, పోలీసులే కారణమని మంగమ్మ కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. మంగమ్మ ప్రస్తుతం కర్నూలు ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది.

ఆత్మహత్యాయత్నం చేసిన మంగమ్మ

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.