ETV Bharat / state

ఇంటి గోడ వివాదం... వైకాపా నేత దౌర్జన్యం!

author img

By

Published : Nov 29, 2020, 6:02 AM IST

కర్నూలు జిల్లా నంద్యాల ముల్లాన్ పేటలో ఇంటి గోడ విషయంలో ఇద్దరు యజమానుల మధ్య వివాదం నెలకొంది. ఈ వివాదంలో ఓ వర్గానికి మద్దతుగా వచ్చిన వైకాపా నాయకుడు తమను బెదిరించాడని ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ వ్యవహారంలో ఇరు వర్గాలు పరస్పర ఫిర్యాదులు చేసుకున్నారు.

Ycp leader outrage
Ycp leader outrage
ఇంటి గోడ వివాదం... వైకాపా నేత దౌర్జన్యం!

కర్నూలు జిల్లా నంద్యాల ముల్లాన్ పేటకు చెందిన జులేఖా బీ అనే మహిళకు ఇంటి పక్కన ఉంటున్న షేక్ మహబూబ్ బీ అనే మహిళకు ఇంటి గోడ విషయంలో వివాదం నెలకొంది. ఈ క్రమంలో మహబూబ్ బీ తరఫున వైకాపా నాయకుడు తనను దూషించి.. ఇష్టారాజ్యంగా మాట్లాడినట్లు జులేఖా బీ నంద్యాల ఒకటో పట్టణ పోలీసు స్టేషన్​లో ఫిర్యాదు చేసింది. ఈ మహిళ ఫిర్యాదు మేరకు 24 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ వ్యవహారంలో మహబూబ్ బీ జులేఖా బీపై మరో వర్గం ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. పరస్పర ఫిర్యాదులు స్వీకరించిన పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండి : కాకినాడ తీరంలో సైనిక, నౌకాదళ యుద్ధ విన్యాసాలు

ఇంటి గోడ వివాదం... వైకాపా నేత దౌర్జన్యం!

కర్నూలు జిల్లా నంద్యాల ముల్లాన్ పేటకు చెందిన జులేఖా బీ అనే మహిళకు ఇంటి పక్కన ఉంటున్న షేక్ మహబూబ్ బీ అనే మహిళకు ఇంటి గోడ విషయంలో వివాదం నెలకొంది. ఈ క్రమంలో మహబూబ్ బీ తరఫున వైకాపా నాయకుడు తనను దూషించి.. ఇష్టారాజ్యంగా మాట్లాడినట్లు జులేఖా బీ నంద్యాల ఒకటో పట్టణ పోలీసు స్టేషన్​లో ఫిర్యాదు చేసింది. ఈ మహిళ ఫిర్యాదు మేరకు 24 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ వ్యవహారంలో మహబూబ్ బీ జులేఖా బీపై మరో వర్గం ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. పరస్పర ఫిర్యాదులు స్వీకరించిన పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండి : కాకినాడ తీరంలో సైనిక, నౌకాదళ యుద్ధ విన్యాసాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.