ETV Bharat / state

వాహనం ఢీ.. ఇద్దరు యువకులు మృతి

author img

By

Published : Feb 25, 2021, 3:51 AM IST

కర్నూలు జిల్లా సిరాలదొడ్డి సమీపంలో గుర్తు తెలియని వాహనం ఢీ కొన్న ఘటనలో ఇద్దరు యువకులు మృతి చెందారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు.. మృతదేహాలను శవపరీక్ష కోసం ఎమ్మిగనూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

accident in kurnool district two dead
గుర్తుతెలియని వాహనం ఢీకొని ఇద్దరు యువకులు మృతి

కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలంలోని సిరాలదొడ్డి సమీపంలో గుర్తు తెలియని వాహనం ఢీకొని లోకేశ్​, వీరేశ్​ అనే ఇద్దరు యువకులు దుర్మరణం చెందారు. సిరాలదొడ్డిలో దేవరకు వెళ్తుండగా ఈ ఘటన జరిగింది.

మృతుడు లోకేశ్ ది ఎమ్మిగనూరు మండలంలోని కడివేళ్ల గ్రామం కాగా.. ఇతడికి రెండు నెలలు క్రితమే వివాహమైంది. ప్రమాదం గురించి తెలుసుకున్న కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. వీరేశ్​ సి.బెలగల్ గ్రామానికి చెందిన వాసని పోలీసులు గుర్తించారు. మృతదేహాలను శవపరీక్ష కోసం ఎమ్మిగనూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలంలోని సిరాలదొడ్డి సమీపంలో గుర్తు తెలియని వాహనం ఢీకొని లోకేశ్​, వీరేశ్​ అనే ఇద్దరు యువకులు దుర్మరణం చెందారు. సిరాలదొడ్డిలో దేవరకు వెళ్తుండగా ఈ ఘటన జరిగింది.

మృతుడు లోకేశ్ ది ఎమ్మిగనూరు మండలంలోని కడివేళ్ల గ్రామం కాగా.. ఇతడికి రెండు నెలలు క్రితమే వివాహమైంది. ప్రమాదం గురించి తెలుసుకున్న కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. వీరేశ్​ సి.బెలగల్ గ్రామానికి చెందిన వాసని పోలీసులు గుర్తించారు. మృతదేహాలను శవపరీక్ష కోసం ఎమ్మిగనూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

ఇదీ చదవండి:

'పెండింగ్​ జీతాలు వెంటనే చెల్లించాలి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.