ETV Bharat / state

కర్నూలులో పట్టపగలే చోరీ...కేసు నమోదు

author img

By

Published : May 4, 2021, 10:29 AM IST

కర్నూలులో పట్టపగలే ఓ ఇంట్లో చోరీ జరిగింది. 10 తులాల బంగారం, రూ. 5వేల నగదును దొంగలను అపహరించుకుపోయారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

కర్నూలులో పట్టపగలే చోరీ...కేసు నమోదు
కర్నూలులో పట్టపగలే చోరీ...కేసు నమోదు

కర్నూలు చిదంబరరావు వీధిలో భాస్కర్​ శర్మ అనే వ్యక్తి ఇంట్లో సోమవారం పట్టపగలు చోరీ జరిగింది. నగరపాలక సంస్థలో లైబ్రరీయన్​గా పనిచేసే ఆయన.. తన భార్యతో కలిసి ఉదయం బ్యాంకుకు వెళ్లారు. మెుదటి అంతస్తులో కుమారుడు ఉండటంతో తాళం వేసి తాళం చెవిని ఇంటి బయట రహస్య ప్రదేశంలో ఉంచి వెళ్లారు. దీనిని గమనించిన దొంగలు సదరు తాళం చెవి తీసుకొని ఇంట్లోకి చొరబడి బీరువాలోని సొత్తును అపహరించారు. 10 తులాల బంగారు ఆభరణాలు, రూ. 5 వేల నగదు అపహరణకు గురైనట్లు బాధితులు తెలిపారు. ఒకటో పట్టణ సీఐ కళా వెంకటరమణ ఇంటిని పరిశీలించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

కర్నూలు చిదంబరరావు వీధిలో భాస్కర్​ శర్మ అనే వ్యక్తి ఇంట్లో సోమవారం పట్టపగలు చోరీ జరిగింది. నగరపాలక సంస్థలో లైబ్రరీయన్​గా పనిచేసే ఆయన.. తన భార్యతో కలిసి ఉదయం బ్యాంకుకు వెళ్లారు. మెుదటి అంతస్తులో కుమారుడు ఉండటంతో తాళం వేసి తాళం చెవిని ఇంటి బయట రహస్య ప్రదేశంలో ఉంచి వెళ్లారు. దీనిని గమనించిన దొంగలు సదరు తాళం చెవి తీసుకొని ఇంట్లోకి చొరబడి బీరువాలోని సొత్తును అపహరించారు. 10 తులాల బంగారు ఆభరణాలు, రూ. 5 వేల నగదు అపహరణకు గురైనట్లు బాధితులు తెలిపారు. ఒకటో పట్టణ సీఐ కళా వెంకటరమణ ఇంటిని పరిశీలించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

ఇదీ చదవండి:

ఇవాళ కేబినెట్ భేటీ.. చర్చించే అంశాలివే

'లాక్​డౌన్​'- కొవిడ్​ను దిగ్బంధించే వ్యూహం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.