కర్నూలు జిల్లా ఆదోనిలో పురపాలక ఉద్యోగి అనుమానాస్పదంగా మృతి చెందాడు. బస్టాండ్ దగ్గర స్థానికులు మృతదేహాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని పురపాలక ఉద్యోగి ప్రసాద్గా గుర్తించారు. 6 నెలల క్రితం ప్రసాద్ విధుల నుంచి సస్పెండ్ అయ్యాడని అధికారులు తెలిపారు. రెండో పట్టణ సీఐ లక్ష్మయ్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.