ETV Bharat / state

ఆదోనిలో అక్రమంగా తరలిస్తున్న కర్ణాటక మద్యం స్వాధీనం

author img

By

Published : Oct 23, 2020, 7:33 PM IST

కర్నూలు జిల్లా ఆదోని శివారు సిరుగుప్ప చెక్ పోస్ట్ వద్ద పోలీసులు చేపట్టిన తనిఖీల్లో అక్రమంగా తరలిస్తున్న కర్ణాటక మద్యాన్ని గుర్తించారు. విలువ సుమారు రూ.1.90 లక్షలు ఉంటుందని అంచనా వేశారు.

Seized of Karnataka liquor smuggled in Adoni
ఆదోనిలో అక్రమంగా తరలిస్తున్న కర్ణాటక మద్యం స్వాధీనం

కర్నూలు జిల్లా ఆదోని శివారు చెక్ పోస్టు వద్ద పోలీసులు సోదాలు నిర్వహించారు. తనిఖీలను చేస్తున్న ఖాకీలను చూసి కర్ణాటకకు చెందిన కారు వేగంగా దూసుకుపోయింది. పోలీసులు కారును వెంబడించారు. వారిని చూసిన కారు డ్రైవర్ వాహనాన్ని వదిలి పరారయ్యాడు. ఆ వాహనాన్ని సోదా చేసిన పోలీసులు అందులో 20పెట్టెల్లో అక్రమంగా తరలిస్తున్న 1920 మద్యం టెట్రా ప్యాకెట్లను గుర్తించారు. వీటి విలువ మార్కెట్లో సుమారు రూ.1.90 లక్షలు ఉంటుందని ఆదోని డీఎస్పీ వినోదకుమార్ తెలిపారు. కారును, సరుకును ఇస్వీ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

కర్నూలు జిల్లా ఆదోని శివారు చెక్ పోస్టు వద్ద పోలీసులు సోదాలు నిర్వహించారు. తనిఖీలను చేస్తున్న ఖాకీలను చూసి కర్ణాటకకు చెందిన కారు వేగంగా దూసుకుపోయింది. పోలీసులు కారును వెంబడించారు. వారిని చూసిన కారు డ్రైవర్ వాహనాన్ని వదిలి పరారయ్యాడు. ఆ వాహనాన్ని సోదా చేసిన పోలీసులు అందులో 20పెట్టెల్లో అక్రమంగా తరలిస్తున్న 1920 మద్యం టెట్రా ప్యాకెట్లను గుర్తించారు. వీటి విలువ మార్కెట్లో సుమారు రూ.1.90 లక్షలు ఉంటుందని ఆదోని డీఎస్పీ వినోదకుమార్ తెలిపారు. కారును, సరుకును ఇస్వీ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

ఇవీ చదవండి: కుళాయి పన్నుల వసూళ్లలో అధికారుల చేతివాటం... ఆందోళనలో జనం

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.