ETV Bharat / state

రెండు ద్విచక్రవాహనాలు ఢీ.. ఇద్దరు మృతి - కర్నూలు జిల్లా తాజా వార్తలు

కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో రోడ్డు ప్రమాదం జరిగి ఇద్దరు మృతి చెందారు. రెండు ద్విచక్రవాహనాలు ఢీకొన్నఈ ఘటనలో ఐదుగురికి గాయాలయ్యాయి. తీవ్రంగా గాయపడిన ఇద్దరిని మెరుగైన చికిత్స నిమిత్తం నంద్యాలకు తరలించారు.

road-accident
road-accident
author img

By

Published : Jun 15, 2021, 10:47 AM IST

Updated : Jun 15, 2021, 11:29 AM IST

కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ పట్టణ శివార్లలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. ఆళ్లగడ్డ పురపాలిక పరిధిలోని పడకండ్ల గ్రామానికి చెందిన శ్రీనివాసులు తన భార్య, ముగ్గురు పిల్లలతో కలిసి ద్విచక్ర వాహనంలో బంధువుల ఇంట్లో జరుగుతున్న శుభ కార్యక్రమంలో పాల్గొనేందుకు రుద్రవరం మండలం పేరూరు గ్రామానికి బయలుదేరాడు. వీరు వెళ్తున్న వాహనాన్ని ఎదురుగా వస్తున్న మరో ద్విచక్ర వాహనం ఢీకొంది. ఈ ఘటనలో బైకు ముందు భాగాన కూర్చొని ఉన్న శ్రీనివాసులు కుమారుడు శర్వానంద్ (4) అక్కడికక్కడే మృతి చెందాడు.

తీవ్రంగా గాయపడిన శ్రీనివాసులు, అతని భార్య వెంకట సుబ్బమ్మ, కుమారుడు చరణ్, కుమార్తె హరితతో పాటు.. ఎదురుగా వస్తున్న ద్విచక్ర వాహనంలో ప్రయాణిస్తున్న రామలింగారెడ్డి, చైతన్య తీవ్రంగా గాయపడ్డారు. వీరందరినీ 108 వాహనంలో ఆళ్లగడ్డ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడిన రామలింగారెడ్డి ఆసుపత్రిలో మృతి చెందాడు. శ్రీనివాసులు, చైతన్యల పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం నంద్యాలకు తరలించారు. ఆళ్లగడ్డ సీఐ కృష్ణయ్య ,ఎస్ఐ రామాంజనేయులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు.

కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ పట్టణ శివార్లలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. ఆళ్లగడ్డ పురపాలిక పరిధిలోని పడకండ్ల గ్రామానికి చెందిన శ్రీనివాసులు తన భార్య, ముగ్గురు పిల్లలతో కలిసి ద్విచక్ర వాహనంలో బంధువుల ఇంట్లో జరుగుతున్న శుభ కార్యక్రమంలో పాల్గొనేందుకు రుద్రవరం మండలం పేరూరు గ్రామానికి బయలుదేరాడు. వీరు వెళ్తున్న వాహనాన్ని ఎదురుగా వస్తున్న మరో ద్విచక్ర వాహనం ఢీకొంది. ఈ ఘటనలో బైకు ముందు భాగాన కూర్చొని ఉన్న శ్రీనివాసులు కుమారుడు శర్వానంద్ (4) అక్కడికక్కడే మృతి చెందాడు.

తీవ్రంగా గాయపడిన శ్రీనివాసులు, అతని భార్య వెంకట సుబ్బమ్మ, కుమారుడు చరణ్, కుమార్తె హరితతో పాటు.. ఎదురుగా వస్తున్న ద్విచక్ర వాహనంలో ప్రయాణిస్తున్న రామలింగారెడ్డి, చైతన్య తీవ్రంగా గాయపడ్డారు. వీరందరినీ 108 వాహనంలో ఆళ్లగడ్డ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడిన రామలింగారెడ్డి ఆసుపత్రిలో మృతి చెందాడు. శ్రీనివాసులు, చైతన్యల పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం నంద్యాలకు తరలించారు. ఆళ్లగడ్డ సీఐ కృష్ణయ్య ,ఎస్ఐ రామాంజనేయులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు.

ఇదీ చదవండి:

RaghuRama letter to Jagan: సీఎంకు ఎంపీ రఘురామ ఆరో లేఖ!

Last Updated : Jun 15, 2021, 11:29 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.