రంజాన్ సందర్బంగా కర్నూలు జిల్లా ఆదోనిలో ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. పట్టణంలోని చారిత్రక జామియా మసీదులో కొవిడ్ నిబంధనలు పాటిస్తూ.. నమాజ్ నిర్వహించారు. కరోనా ఉద్ధృతి దృష్ట్యా కొద్దీ మందికి మసీదులో ప్రార్థనలకు అధికారులు అనుమతి ఇచ్చారు. అనంతరం ఒకరినొకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు. మసీదులో చేసిన విద్యుత్ దీపాలంకరణ... రాత్రి సమయంలో అందరిని విశేషంగా ఆకట్టుకుంది. కర్ఫ్యూ అమలులో ఉన్నందున పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.
ఇవీ చూడండి..: తెలంగాణ వాహనాలు ఏపీలోకి రాకుండా భాజపా ఆధ్వర్యంలో ఆందోళన