ETV Bharat / state

'నాకు ఆ దొంగతనానికి సంబంధం లేదు... నా పేరు బయటకు రానీయకండి'

కర్నూలు జిల్లా నంద్యాలలో ఓ యువకుడు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఏటీఎంలో పెట్టే నగదు దొంగతనానికి తనకు ఏ సంబంధం లేదనీ.. తన చావుకు నిశాంతే కారణమని సూసైడ్ నోట్ రాసి.. ఉరివేసుకున్నాడు.

author img

By

Published : Feb 23, 2021, 3:42 PM IST

one committed suicide
ఉరివేసుకొని యువకుడు ఆత్మహత్య
ఉరివేసుకొని యువకుడు ఆత్మహత్య

కర్నూలు జిల్లా నంద్యాల ఎస్బీఐ కాలనీలో మధుసూదన్ అనే యువకుడు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పలు బ్యాంకులకు చెందిన ఏటీఎంలలో నగదు పెట్టే.. రైటర్ సేఫ్ గార్డ్​లోని సీఆర్ఏగా మధుసూదన్ పని చేస్తున్నాడు. ఏటీఎంలో పెట్టిన నగదులో తేడా రావటంతో.. హెచ్​డీఎఫ్​సీ బ్యాంకు అధికారులు.. మధుసూదన్​ను పిలిచినట్లు తెలిసింది. ఈ క్రమంలో ఇంట్లో ఎవరూ లేని సమయంలో మధుసూదన్ ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.

ఆత్మహత్య చేసుకున్న గదిలో.. మధుసూదన్ రాసినట్లు అనుమానిస్తున్న సూసైడ్ నోటు దొరికింది. అందులో.. " గౌరవనీయులైన బీఎం గారికి నా చావుకి కారణం నిషాంత్. నేను దొంగతనం చేయలేదు. నాకు దానికి సంబంధం లేదు. అవమానం తట్టుకోలే చనిపోవాలని అనుకుంటున్నా. అందుకు దయచేసి నా పేరును బయటపడకుండా చూడమని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఇట్లు మధుసూదన్" అని ఉంది.

నిషాంత్ అనే వ్యక్తి సంఘటనా స్థలానికి చేరుకోవటంతో.. అక్కడే ఉన్న మధుసూదన్ బంధువులు అతడిపై దాడికి దిగారు. అక్కడే ఉన్న పోలీసులు వారిని నిలువరించి.. నిషాంత్​ను పోలీస్ స్టేషన్​కి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి.. దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు వెల్లడించారు.

ఇదీ చదవండి: ఉద్యోగం కోల్పోవటంతో.. సాఫ్ట్​వేర్​ ఉద్యోగి ఆత్మహత్య

ఉరివేసుకొని యువకుడు ఆత్మహత్య

కర్నూలు జిల్లా నంద్యాల ఎస్బీఐ కాలనీలో మధుసూదన్ అనే యువకుడు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పలు బ్యాంకులకు చెందిన ఏటీఎంలలో నగదు పెట్టే.. రైటర్ సేఫ్ గార్డ్​లోని సీఆర్ఏగా మధుసూదన్ పని చేస్తున్నాడు. ఏటీఎంలో పెట్టిన నగదులో తేడా రావటంతో.. హెచ్​డీఎఫ్​సీ బ్యాంకు అధికారులు.. మధుసూదన్​ను పిలిచినట్లు తెలిసింది. ఈ క్రమంలో ఇంట్లో ఎవరూ లేని సమయంలో మధుసూదన్ ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.

ఆత్మహత్య చేసుకున్న గదిలో.. మధుసూదన్ రాసినట్లు అనుమానిస్తున్న సూసైడ్ నోటు దొరికింది. అందులో.. " గౌరవనీయులైన బీఎం గారికి నా చావుకి కారణం నిషాంత్. నేను దొంగతనం చేయలేదు. నాకు దానికి సంబంధం లేదు. అవమానం తట్టుకోలే చనిపోవాలని అనుకుంటున్నా. అందుకు దయచేసి నా పేరును బయటపడకుండా చూడమని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఇట్లు మధుసూదన్" అని ఉంది.

నిషాంత్ అనే వ్యక్తి సంఘటనా స్థలానికి చేరుకోవటంతో.. అక్కడే ఉన్న మధుసూదన్ బంధువులు అతడిపై దాడికి దిగారు. అక్కడే ఉన్న పోలీసులు వారిని నిలువరించి.. నిషాంత్​ను పోలీస్ స్టేషన్​కి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి.. దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు వెల్లడించారు.

ఇదీ చదవండి: ఉద్యోగం కోల్పోవటంతో.. సాఫ్ట్​వేర్​ ఉద్యోగి ఆత్మహత్య

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.