కర్నూలు నగర సమీపంలో గుత్తి పెట్రోల్ బంక్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ ప్రైవేట్ కళాశాల బస్సు ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టిన ఘటనలో మన్సూర్ అనే విద్యార్థి అక్కడికక్కడే మృతి చెందాడు. కర్నూలు మెడికల్ కళాశాలలో డిప్లమో ఇన్ మెడికల్ ల్యాబ్ టెక్నిషియన్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడని స్నేహితులు తెలిపారు. స్వచ్ఛంద రక్తదాతగా మన్సూర్ అనేక సార్లు రక్తదానం చేశారన్నారు.
ఇదీ చూడండి: శ్రీశైలం వెళ్లి వస్తూ.. తిరిగి రాని లోకాలకు!