ETV Bharat / state

స్వచ్ఛ నంద్యాల.. ఔరా అనేలా...!

కర్నూలు జిల్లా నంద్యాలను స్వచ్ఛ పట్టణంగా తీర్చిదిద్దేందుకు పురపాలక సంఘం ప్రత్యేక కార్యాచరణ చేపట్టింది. పురపాలక సిబ్బంది వినూత్న రీతిలో వాణిజ్య, వ్యాపార, గృహ సముదాయల నుంచి విడివిడిగా చెత్త సేకరిస్తున్నారు. తడి చెత్తతో ఎరువులు, పొడి చెత్తను పునర్వినియోగిస్తూ స్వచ్ఛత వైపు అడుగులు వేస్తోంది నంద్యాల.

author img

By

Published : Dec 21, 2019, 5:31 PM IST

nadyala muncipality clean drive and waste disposable
స్వచ్ఛ నంద్యాల.. ఔరా అనేలా...!
నంద్యాలను స్వచ్ఛ పట్టణంగా తీర్చిదిద్దేలా పురపాలక సిబ్బంది కార్యాచరణ
స్వచ్ఛభారత్​ సాధనకు అనుగుణంగా.. పట్టణాలను స్వచ్ఛతకు మారుపేరుగా తీర్చిదిద్దేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయి. వివిధ పథకాలు, పురస్కారాలు ప్రవేశపెట్టి, స్వచ్ఛత సాధించేలా ఊతమిస్తున్నాయి. ఈ పథకాలను అందిపుచ్చుకుంటున్న కర్నూలు జిల్లా నంద్యాల పురపాలక సంఘం స్వచ్ఛతలో ఓ అడుగు ముందుకేసింది.

తడి, పొడి చెత్త వేరువేరుగా

పురపాలక పరిధిలోని వాణిజ్య, వ్యాపార, గృహ సముదాయాల నుంచి నేరుగా చెత్తను సేకరిస్తోంది. చెత్త సేకరణలోనే... తడి, పొడి చెత్తను వేరు చేస్తోంది. ఇలా సేకరించిన చెత్తతో సేంద్రియ ఎరువులు తయారుచేస్తున్నారు. పొడి చెత్తను పునర్వినియోగిస్తున్నారు. వీటితో పాటు ఒకసారి వినియోగించే ప్లాస్టిక్ నియంత్రణకు చర్యలు చేపడుతున్నారు. పొడి చెత్త పునర్వినియోగం కోసం మెటీరియల్ రికవరీ ఫెసిలిటీ అనే కార్యక్రమాన్ని వచ్చే నెల నుంచి ప్రారంభించనున్నట్లు అధికారులు పేర్కొన్నారు. నంద్యాల పట్టణాన్ని స్వచ్ఛ పట్టణంగా తీర్చిదిద్దేదుకు కృషిచేస్తున్నామంటున్నారు.

ఇదీ చదవండి:

కర్నూలులో ఉత్కంఠభరితంగా ఈనాడు క్రికెట్ పోటీలు

నంద్యాలను స్వచ్ఛ పట్టణంగా తీర్చిదిద్దేలా పురపాలక సిబ్బంది కార్యాచరణ
స్వచ్ఛభారత్​ సాధనకు అనుగుణంగా.. పట్టణాలను స్వచ్ఛతకు మారుపేరుగా తీర్చిదిద్దేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయి. వివిధ పథకాలు, పురస్కారాలు ప్రవేశపెట్టి, స్వచ్ఛత సాధించేలా ఊతమిస్తున్నాయి. ఈ పథకాలను అందిపుచ్చుకుంటున్న కర్నూలు జిల్లా నంద్యాల పురపాలక సంఘం స్వచ్ఛతలో ఓ అడుగు ముందుకేసింది.

తడి, పొడి చెత్త వేరువేరుగా

పురపాలక పరిధిలోని వాణిజ్య, వ్యాపార, గృహ సముదాయాల నుంచి నేరుగా చెత్తను సేకరిస్తోంది. చెత్త సేకరణలోనే... తడి, పొడి చెత్తను వేరు చేస్తోంది. ఇలా సేకరించిన చెత్తతో సేంద్రియ ఎరువులు తయారుచేస్తున్నారు. పొడి చెత్తను పునర్వినియోగిస్తున్నారు. వీటితో పాటు ఒకసారి వినియోగించే ప్లాస్టిక్ నియంత్రణకు చర్యలు చేపడుతున్నారు. పొడి చెత్త పునర్వినియోగం కోసం మెటీరియల్ రికవరీ ఫెసిలిటీ అనే కార్యక్రమాన్ని వచ్చే నెల నుంచి ప్రారంభించనున్నట్లు అధికారులు పేర్కొన్నారు. నంద్యాల పట్టణాన్ని స్వచ్ఛ పట్టణంగా తీర్చిదిద్దేదుకు కృషిచేస్తున్నామంటున్నారు.

ఇదీ చదవండి:

కర్నూలులో ఉత్కంఠభరితంగా ఈనాడు క్రికెట్ పోటీలు

Intro:ap_knl_22_20_muncipality_a_pkg_ap10058
యాంకర్: స్వచ్ఛ పట్టణ ఏర్పాటుకు కర్నూలు జిల్లా నంద్యాల పురపాలక సంఘం అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. వినూత్న రీతిలో వాణిజ్య, వ్యాపార, గృహసముదాయల (అపార్టుమెంట్లు) నుంచి చెత్తను సేకరిస్తున్నారు.
వాయిస్ ఓవర్: పట్టణాల పరిశుభ్రత పై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇటీవల ప్రత్యేక దృష్టి సారించాయి.పలు రకాల పథకాలు ప్రవేశపెట్టి పురస్కారాలు అందజేస్తున్నాయి. బాహుమతుల సంగతి అటుంచితే....స్వచ్ఛత కోసం పురపాలక అధికారాలు విభిన్నంగా స్పందిస్తున్నారు. ఈ క్రమంలో నంద్యాల పురపాలక సంఘం వాణిజ్య వ్యాపార సముదాయాల నుంచి నేరుగా చెత్తను సేకరిస్తున్నాయి. ఉదయం సాయంత్రం కొంత సమయాన్ని దీనికి కేటాయిస్తున్నారు. ఇందులోనూ తడి పొడి చెత్తను వేరు చేసి సేంద్రీయ పద్ధతుల్లో ఎరువును తయారు చేస్తున్నారు. ప్లాస్టిక్ నియంత్రణకు చర్యలు చేపట్టిన అధికారులు సేకరణ దశలోనే దీన్ని వేరు చేస్తున్నారు. తడి పొడి చెత్తనే కాకుండా హానికరక చెత్తను వేరు చేసి పలువురికి ఆదర్శమవుతున్నారు. పొడి చెత్తను పునర్వినియోగం చేయాలనే ఉద్దేశంతో మెటీరియల్ రికవరీ ఫెసిలిటీ అనే కార్యక్రమాన్ని వచ్చే నెల నుంచి ప్రారంభించనున్నారు.
బైట్: వెంకట కృష్ణ, కమిషనర్,నంద్యాల పురపాలక సంఘం


Body:స్వచ్ఛ నంద్యాల


Conclusion:9394450145 సీసీ నరసింహులు, నంద్యాల, కర్నూలు జిల్లా
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.