తడి, పొడి చెత్త వేరువేరుగా
పురపాలక పరిధిలోని వాణిజ్య, వ్యాపార, గృహ సముదాయాల నుంచి నేరుగా చెత్తను సేకరిస్తోంది. చెత్త సేకరణలోనే... తడి, పొడి చెత్తను వేరు చేస్తోంది. ఇలా సేకరించిన చెత్తతో సేంద్రియ ఎరువులు తయారుచేస్తున్నారు. పొడి చెత్తను పునర్వినియోగిస్తున్నారు. వీటితో పాటు ఒకసారి వినియోగించే ప్లాస్టిక్ నియంత్రణకు చర్యలు చేపడుతున్నారు. పొడి చెత్త పునర్వినియోగం కోసం మెటీరియల్ రికవరీ ఫెసిలిటీ అనే కార్యక్రమాన్ని వచ్చే నెల నుంచి ప్రారంభించనున్నట్లు అధికారులు పేర్కొన్నారు. నంద్యాల పట్టణాన్ని స్వచ్ఛ పట్టణంగా తీర్చిదిద్దేదుకు కృషిచేస్తున్నామంటున్నారు.
ఇదీ చదవండి: