ETV Bharat / state

వివాహిత మృతి... భర్తపైనే బాధిత కుటుంబం అనుమానం

author img

By

Published : Jan 4, 2020, 9:45 AM IST

కర్నూలు జిల్లా నందికొట్కూరులో వివాహిత మృతి చెందింది. ఆమె భర్తపైనే మృతురాలి కుటుంబీకులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వేధింపులు తట్టుకోలేకే ఆత్మహత్య చేసుకున్నట్లు ఆరోపించారు.

married women died in kurnool dst nadikotkur related suspected about this died
చనిపోయిన మహిళ
నందికొట్కూరులో వివాహిత మృతి

కర్నూలు జిల్లా నందికొట్కూరులో గృహిణి సునిత.. అనుమానాస్పద స్థితిలో చనిపోయింది. బాధిత కుటుంబం, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సునితకు 9 ఏళ్ల కిందట రాజు అనే వ్యక్తితో వివాహమైంది. ఆ దంపతులకు ముగ్గురు ఆడపిల్లలే పుట్టారు. ఈ కారణంగా భర్త వేరే పెళ్లి చేసుకుంటానని ఏడాది నుంచి సునితను ఇబ్బంది పెడుతున్నట్లు మృతురాలి కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ క్రమంలో వేరే మహిళతో రాజు అక్రమ సంబంధం పెట్టుకున్నాడని ఆరోపించారు. విషయం తెలుకున్న సునిత... మానసికంగా కుంగిపోయి ఆత్మహత్య చేసుకున్నట్లు తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

నందికొట్కూరులో వివాహిత మృతి

కర్నూలు జిల్లా నందికొట్కూరులో గృహిణి సునిత.. అనుమానాస్పద స్థితిలో చనిపోయింది. బాధిత కుటుంబం, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సునితకు 9 ఏళ్ల కిందట రాజు అనే వ్యక్తితో వివాహమైంది. ఆ దంపతులకు ముగ్గురు ఆడపిల్లలే పుట్టారు. ఈ కారణంగా భర్త వేరే పెళ్లి చేసుకుంటానని ఏడాది నుంచి సునితను ఇబ్బంది పెడుతున్నట్లు మృతురాలి కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ క్రమంలో వేరే మహిళతో రాజు అక్రమ సంబంధం పెట్టుకున్నాడని ఆరోపించారు. విషయం తెలుకున్న సునిత... మానసికంగా కుంగిపోయి ఆత్మహత్య చేసుకున్నట్లు తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఇదీ చూడండి

రెండు ఆప్షన్​లూ.. విశాఖ వైపే మొగ్గు

Intro:నందికొట్కూరు పట్టణం సుబ్బారావు పేట కాలనీకి చెందిన సునీత ఆత్మహత్య అనుమానాస్పదంగా ఉందని మృతురాలి తల్లిదండ్రులు ఆరోపించారు. తొమ్మిది సంవత్సరాల కిందట మిడుతూరు మండలం చెరుకు చెర్ల గ్రామానికి చెందిన రాజుతో సునీతకు వివాహమైంది. వీరికి ముగ్గురు కుమార్తెలు. ముగ్గురు కుమార్తెలు పుట్టారని కుమారుడి కోసం మరో వివాహం చేసుకుంటానని ఏడాదిగా సునీతను ఇబ్బందులు పెట్టేవారని, మరో మహిళతో అక్రమ సంబంధం ఉన్నట్లు మృతురాలి బంధువులు ఆరోపించారు. భర్త పెట్టే బాధలను తట్టుకోలేకే ఆత్మహత్య చేసుకున్నట్లు వారు తెలిపారు. స్థానిక పోలీసులు మృతదేహాన్ని పంచనామా నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతురాలి తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.


Body:ss


Conclusion:ss
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.