కర్నూలు జిల్లా అధోని వ్యవసాయ మార్కెట్ యార్డులో.. పత్తికి ధర రికార్డు స్థాయి దక్కింది. వ్యవసాయ మార్కెట్ యార్డు చరిత్రలోనే.. ఈ ధర అధికమని వ్యాపారులు చెబుతున్నారు. క్వింటాల్ పత్తి ధర గరిష్ఠంగా 9,399 రూపాయలు పలికిందని చెప్పారు. కనిష్ఠంగా 6,900 రూపాయల ధర లభించిందని అన్నారు. ధర భారీగా పలకడంతో.. రైతులు సంతోషం వ్యక్తం చేశారు.
దిగుబడులు తగ్గడం వల్ల పత్తికి మంచి డిమాండ్ ఏర్పడి, ధరలు పెరిగాయని వ్యాపార వర్గాలు తెలిపాయి. పొరుగు రాష్ట్రాలతో ధరలతో పోలిస్తే.. రాష్ట్రంలోని ఆధోని మార్కెట్లోనే అత్యధిక ధరలు ఉన్నాయని వ్యాపారస్థులు అంటున్నారు.
ఇదీచదవండి :