ETV Bharat / state

ఆటో డ్రైవర్ నిజాయితీ.. కర్నూలు ఎస్పీ సన్మానం

ఓ ప్రయాణికుడు మర్చిపోయిన ఏడు లక్షల నగదును ఆటో డ్రైవర్ పోలీసులకు తిరిగి అందించాడు. నగదును ఏ మాత్రం ముట్టుకోకుండా నిజాయితీగా అడిగిన వెంటనే ఇచ్చిన డ్రైవర్​ను కర్నూలు జిల్లా ఎస్పీ సన్మానించారు.

author img

By

Published : May 13, 2019, 11:54 PM IST

'ఆటో డ్రైవర్ నిజాయితీ- కర్నూలు ఎస్పీ సన్మానం'

ఆటోలో మరిచిపోయిన 7లక్షల రూపాయల నగదును సీసీ కెమెరాల సాయంతో గుర్తించి తిరిగి బాధితుడికి అప్పగించిన ఘటన కర్నూలులో జరిగింది.
నగరంలోని గురురాఘవేంద్ర నగర్‌కు చెందిన మల్లికార్జున రెడ్డి తన బావమరిదితో కలిసి ఆటోలో బస్టాండ్‌కు బయలుదేరాడు. వారితో పాటు మామిడి కాయల సంచులను, ఏడు లక్షల నగదు ఉన్న సంచిని వెంట తీసుకెళ్లారు. బస్టాండ్‌కు చేరుకోగానే మామిడి కాయల సంచులను మాత్రమే తీసుకుని... నగదు సంచిని మర్చిపోయారు.
నగదు విషయం గుర్తుకు వచ్చిన బాధితుడు వెంటనే 4వ పట్టణ పోలీస్ స్టేషన్​లో ఫిర్యాదు చేశాడు. దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు సీసీ ఫుటేజ్ ద్వారా దృశ్యాలను పరిశీలించి కోడుమూరు వైపు ఆటో వెళ్లినట్లుగా గుర్తించారు. అనంతరం కోడుమూరు రోడ్డు వద్ద వాహన తనిఖీలు చేపట్టిన పోలీసులు ఆటోను గుర్తించారు. ఆటో డ్రైవర్ నిజాయితీగా వ్యవహరించి నగదును పోలీసులకు అప్పగించాడు. అనంతరం నగదును బాధితుడు మల్లికార్జున్ రెడ్డికి జిల్లా ఎస్పీ అందించారు. ఆటో డ్రైవర్‌ నిజాయితీకి మెచ్చిన ఎస్పీ అతన్ని సన్మానించారు.

ఆటోలో మరిచిపోయిన 7లక్షల రూపాయల నగదును సీసీ కెమెరాల సాయంతో గుర్తించి తిరిగి బాధితుడికి అప్పగించిన ఘటన కర్నూలులో జరిగింది.
నగరంలోని గురురాఘవేంద్ర నగర్‌కు చెందిన మల్లికార్జున రెడ్డి తన బావమరిదితో కలిసి ఆటోలో బస్టాండ్‌కు బయలుదేరాడు. వారితో పాటు మామిడి కాయల సంచులను, ఏడు లక్షల నగదు ఉన్న సంచిని వెంట తీసుకెళ్లారు. బస్టాండ్‌కు చేరుకోగానే మామిడి కాయల సంచులను మాత్రమే తీసుకుని... నగదు సంచిని మర్చిపోయారు.
నగదు విషయం గుర్తుకు వచ్చిన బాధితుడు వెంటనే 4వ పట్టణ పోలీస్ స్టేషన్​లో ఫిర్యాదు చేశాడు. దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు సీసీ ఫుటేజ్ ద్వారా దృశ్యాలను పరిశీలించి కోడుమూరు వైపు ఆటో వెళ్లినట్లుగా గుర్తించారు. అనంతరం కోడుమూరు రోడ్డు వద్ద వాహన తనిఖీలు చేపట్టిన పోలీసులు ఆటోను గుర్తించారు. ఆటో డ్రైవర్ నిజాయితీగా వ్యవహరించి నగదును పోలీసులకు అప్పగించాడు. అనంతరం నగదును బాధితుడు మల్లికార్జున్ రెడ్డికి జిల్లా ఎస్పీ అందించారు. ఆటో డ్రైవర్‌ నిజాయితీకి మెచ్చిన ఎస్పీ అతన్ని సన్మానించారు.

ఇవీ చూడండి-వేసవి సెలవులు.. చిత్ర లేఖనంపై విద్యార్థుల ఆసక్తి

Intro:ap_knl_102_13_pidugu_2died_av_c10 కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో ఓబులం పల్లి గ్రామంలో పిడుగు పడి ఇద్దరు మృతి చెందారు ఓబులంపల్లి చెందిన రామయ్య హుస్సేన్ భాష మామిడి తోటలు ఉండగా పిడుగులు పడ్డాయి ఘటనా స్థలంలోనే ఇద్దరు మృతి చెందగా మరొకరు గాయపడ్డారు ఇద్దరు అవివాహితులు వీరి మృతితో గ్రామంలో దుఃఖం నెలకొంది


Body:పిడుగు పడి ఇద్దరి మృతి


Conclusion:పిడుగు పడి ఇద్దరి మృతి
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.