కర్నూలు జిల్లా నందవరం మండలంలోని గురజాలలో ప్రార్థన మందిరం ప్రహరీని అక్రమంగా నిర్మించారని గ్రామస్తులు చేసిన ఫిర్యాదుపై అధికారులు స్పందించారు. అధికారులు పోలీసు బందోబస్తు మధ్య ప్రొక్లెయిన్తో కూల్చి వేశారు.
ఏటా నిర్వహించే రామలింగేశ్వరస్వామి ఆలయ రథోత్సవానికి అడ్డుగా గోడను నిర్మించారన్న ఫిర్యాదును నిర్ధరణ చేసుకున్న అధికారులు.. కూల్చేయించారు. ఈ సందర్భంగా ఉద్రిక్తత తలెత్తకుండా గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.
ఇదీ చదవండి:
కేఆర్ఎంబీకి తెలంగాణ మరో లేఖ... త్రిసభ్య కమిటీ భేటీ వాయిదాకు వినతి