కర్నూలు జిల్లా బేతంచెర్ల మండలం గుటుపల్లి గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. గత రాత్రి కురిసిన వర్షానికి మట్టి మిద్దె కూలి యువతి మృతి చెందింది. షెక్షావలి పర్వీన్ దంపతులకు ముగ్గురు కుమార్తెలు. వీరు అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నారు. రెండవ కుమార్తె ఈదుర్స్ భీ, మూడో కుమార్తె షాహిన్ రాత్రి మధ్య గదిలో పడుకున్నారు. వంట గదిలో షెక్షావలి, పర్వీన్ పడుకున్నారు. రాత్రి కురిసిన వర్షానికి మట్టి మిద్దె కూలడంతో ఈదుర్ భీ మృతి చెందారు. దూలం అడ్డుగా ఉండటంతో షాహిన్ ప్రాణాలతో బయటపడింది.
ఇదీ చదవండి: 'న్యాయవ్యవస్థపై విశ్వాసం లేకపోతే హైకోర్టును మూసేయమనండి'