కర్నూలులో ఉగాది ఉత్సవాలు రెండో రోజూ ఘనంగా జరిగాయి. కల్లూరులోని చౌడేశ్వరీ ఆలయంలో పండగ ఉత్సవాలు వైభవంగా సాగాయి. చుట్టూ.. బురుదనీరు ఏర్పాటు చేసి వాటిలో ఎద్దులు, గాడిద బండ్లను ఊరేగించడం ఇక్కడ ఆనవాయితీ. ఈ ఏడాది కూడా బండ్ల ఊరేగింపుని ఉత్సహంగా జరిపారు. బురదలో వస్తున్న బండ్లపైకి భక్తులు బురద చల్లుతూ.. ఉత్సాహంగా వేడుకల్లో పాల్గొన్నారు. ఊరేగింపుని తిలకించేందుకు పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు.
ఇదీ చదవండి: జోరుగా "పిడకల యుద్ధం".. వేలాదిగా తరలి వచ్చిన జనం