విశాఖకు చెందిన సూరిశెట్టి భాస్కర్ ఈ నెల 22న స్నేహితులతో కలిసి శబరిమల వెళ్తానని బయలుదేరాడు. విజయవాడ స్టేషన్లో దిగిపోయి మరో రైలు ఎక్కాడు. భాస్కర్ స్నేహితులు వాళ్ల తల్లి లలితకు ఈ మేరకు సమాచారం అందించారు. భాస్కర్ తల్లి లలిత తమ కుమారుడిని వెతికి పెట్టాలని గన్నవరం పోలీసులను ఆశ్రయించారు.
ఈ నెల 24న ఓ వ్యక్తి ఫోన్ చేసి మీ అబ్బాయి ముస్తాబాదు రైల్వే గేటు వద్ద ఉన్నాడని లలితకు సమాచారం అందించారు. లలిత తమ బంధువులకు చెప్పటంతో వారు ముస్తాబాదు వెళ్లారు. రైల్వే గేటు వద్ద నుంచి బంధువులు భాస్కర్ను తీసుకొస్తుండగా వారిని పక్కకు నెట్టి పరారయ్యాడు. దీంతో లలిత విశాఖ నుంచి ఆన్లైన్లో గన్నవరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కానీ భాస్కర్ అప్పటికే వీరవల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో రైలు పట్టాలపై అనుమానాస్పద స్థితిలో మృతిచెంది ఉన్నాడు.
ఇదీ చదవండి: చెల్లెలి కాపురం చెదిరిపోయిందని... అన్న ఏంచేశాడో చూడండి!