ETV Bharat / state

ఓటర్ల జాబితాలో తప్పులపై ఎస్ఈసీకి ఫిర్యాదు

విజయవాడ నగరపాలక సంస్థ ఎన్నికల జాబితాలో తప్పులు జరిగాయని వైకాపా నేత పిల్లి వెంకటేశ్వరరెడ్డి అన్నారు. ఈ అంశంపై ఓటర్ల జాబితాను సవరించాలని అధికారులను కోరినప్పటికీ, సరైన స్పందన లేదని తెలిపారు. ఫలితంగా ఎస్ఈసీ కి ఫిర్యాదు చేసినట్లు వెంకటేశ్వరరెడ్డి వెల్లడించారు.

author img

By

Published : Mar 4, 2021, 7:42 PM IST

ycp leader pilli venkateshwarareddy complaint to sec for voter list correction
వైకాపా నేత పిల్లి వెంకటేశ్వరరెడ్డి

విజయవాడ నగరపాలక సంస్థ ఎన్నికల ఓటర్ల జాబితాలో జరిగిన తప్పులపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్​కు ఫిర్యాదు చేసినట్లు వైకాపా నేత పిల్లి వెంకటేశ్వరరెడ్డి తెలిపారు. నగరంలో డివిజన్ల సంఖ్య పెరుగుదలతో తమ డివిజన్​లో ఉండాల్సిన ఓట్లు లేకుండాపోయాయని, ఇలా ప్రతి డివిజన్​లో వందల సంఖ్యలో ఓట్లు వేరే డివిజన్లలో నమోదు కావడంతో గందరగోళం నెలకొందని ఆయన అన్నారు. ఈ అంశంపై అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ... జాబితాను సరిచేయలేదని వెంకటేశ్వరరెడ్డి ఆక్షేపించారు.

విజయవాడ నగరపాలక సంస్థ ఎన్నికల ఓటర్ల జాబితాలో జరిగిన తప్పులపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్​కు ఫిర్యాదు చేసినట్లు వైకాపా నేత పిల్లి వెంకటేశ్వరరెడ్డి తెలిపారు. నగరంలో డివిజన్ల సంఖ్య పెరుగుదలతో తమ డివిజన్​లో ఉండాల్సిన ఓట్లు లేకుండాపోయాయని, ఇలా ప్రతి డివిజన్​లో వందల సంఖ్యలో ఓట్లు వేరే డివిజన్లలో నమోదు కావడంతో గందరగోళం నెలకొందని ఆయన అన్నారు. ఈ అంశంపై అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ... జాబితాను సరిచేయలేదని వెంకటేశ్వరరెడ్డి ఆక్షేపించారు.

ఇదీచదవండి.

నేను అభివృద్ధి చేస్తే.. జగన్ విధ్వంసం సృష్టిస్తున్నాడు: చంద్రబాబు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.