భవానీపురంలో మహిళ హత్య కలకలం.. కృష్ణా జిల్లా విజయవాడ భవానీపురంలో దారుణం జరిగింది. ఓ మహిళ కళ్లల్లో కారం కొట్టిన దుండగులు గొంతు కోసి ఒంటిపై ఉన్న ఆభరణాలను దోచుకెళ్లారు. మృతురాలు స్థానిక పాండు హోటల్ సమీపంలో ఉండే యేదుపాటి పద్మావతిగా గుర్తించారు. ఘటనా స్థలానికి చేరుకున్న భవానీపురం పోలీసులు మృతదేహాన్ని పరిశీలించారు. క్లూస్ టీం బృందాలు ఆధారాలు సేకరించాయి. సీసీ టీవీ ఫుటేజ్ని పోలీసులు పరిశీలిస్తున్నారు. త్వరలోనే నిందితులను పట్టుకుంటామని పోలీసులు తెలిపారు.
ఇదీ చదవండి:
'చంపుతాడనే భయంతో... తండ్రిని చంపేశాడు'