ETV Bharat / state

సచివాలయ పోస్టుల నియామక పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు

ఈనెల 20 నుంచి 26 వరకు జరగనున్న గ్రామ సచివాలయ పోస్టుల నియామక పరీక్షలను... పకడ్బందీగా నిర్వహించాలని కృష్ణా జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ అహ్మద్ సిబ్బందిని ఆదేశించారు. లక్ష 19 వేల 515 మంది అభ్యర్ధులు పరీక్షకు హాజరుకానున్నారని తెలిపారు.

author img

By

Published : Sep 9, 2020, 12:34 AM IST

village secreatariat exams must held very strictly says krishna district collrctor inthiyaz ahmed
గ్రామ సచివాలయ పోస్టుల భర్తీ నియామక పరీక్షలు పకడ్బందీ ఏర్పాట్లు

కృష్ణా జిల్లాలో ఈనెల 20 నుంచి 26 వరకు గ్రామ సచివాలయ పోస్టుల నియామక పరీక్షలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. అంతా పకడ్భందీగా నిర్వహించాలని... జిల్లా పాలనాధికారి ఇంతియాజ్‌ అహ్మద్‌ సిబ్బందిని ఆదేశించారు. పరీక్షల నిర్వహణ ఏర్పాట్లలో భాగంగా చీఫ్‌ సూపరింటెండెంట్లు, ఇన్విజలేటర్లకు తొలివిడత శిక్షణ నిర్వహించారు.

గత ఏడాది జిల్లాలోని 845 గ్రామ, 450 వార్డు సచివాలయాలకు నిర్వహించిన పరీక్షల ద్వారా 9,564 మంది నియమితులయ్యారని, మరో 1425 పోస్టుల భర్తీకి... లక్ష 19 వేల 515 మంది అభ్యర్ధులు హాజరు కానున్నారని కలెక్టర్ తెలిపారు. ఈ పరీక్షల కోసం 550 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు.

కృష్ణా జిల్లాలో ఈనెల 20 నుంచి 26 వరకు గ్రామ సచివాలయ పోస్టుల నియామక పరీక్షలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. అంతా పకడ్భందీగా నిర్వహించాలని... జిల్లా పాలనాధికారి ఇంతియాజ్‌ అహ్మద్‌ సిబ్బందిని ఆదేశించారు. పరీక్షల నిర్వహణ ఏర్పాట్లలో భాగంగా చీఫ్‌ సూపరింటెండెంట్లు, ఇన్విజలేటర్లకు తొలివిడత శిక్షణ నిర్వహించారు.

గత ఏడాది జిల్లాలోని 845 గ్రామ, 450 వార్డు సచివాలయాలకు నిర్వహించిన పరీక్షల ద్వారా 9,564 మంది నియమితులయ్యారని, మరో 1425 పోస్టుల భర్తీకి... లక్ష 19 వేల 515 మంది అభ్యర్ధులు హాజరు కానున్నారని కలెక్టర్ తెలిపారు. ఈ పరీక్షల కోసం 550 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు.

ఇదీ చదవండి:

'అమరావతిలో రాజధాని వద్దని చెప్పడం వెనుక కుట్ర'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.