ETV Bharat / state

'వైకాపా ఎంపీలు అజ్ఞానాన్ని బయటపెట్టుకున్నారు'

author img

By

Published : Jul 3, 2020, 9:15 PM IST

రఘురామకృష్ణరాజుపై లోక్​సభ స్పీకర్​కు వైకాపా ఎంపీలు అనర్హత వేటు పిటిషన్ ఇవ్వటం ఓ నాటకమని తెదేపా సీనియర్ నేత యనమల రామకృష్ణుడు విమర్శించారు. రఘురామకృష్ణరాజుపై అనర్హత పిటిషన్‌కు అవకాశమే లేదని ఆయన స్పష్టం చేశారు.

yanamala ramakrishnudu
yanamala ramakrishnudu

స్పీకర్ పరిధిలోకి రాని అంశంపై వైకాపా ఎంపీలు అనర్హత పిటిషన్ ఇవ్వడం.. చట్టంపై వారికున్న అజ్ఞానాన్ని బయటపెట్టిందని శాసన మండలి ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు ఎద్దేవా చేశారు. రఘురామకృష్ణరాజుపై అనర్హత పిటిషన్ ఒక డ్రామా అని విమర్శించారు. అనర్హతకు అవకాశమే లేదని స్పష్టం చేశారు.

సభ వెలుపల జరిగిన అంశాల ఆధారంగా అనర్హత వేటు పడదు. రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్​లో ఇది స్పష్టంగా చెప్పారు. విప్​ను ధిక్కరించి ఓటు వేసినా, సభకు గైర్హాజరు అయితే అనర్హత పరిధిలోకి వస్తారు. ఎంపీ రఘరామకృష్ణరాజు విషయంలో ఈ రెండూ జరగలేదు - యనమల రామకృష్ణుడు

స్పీకర్ పరిధిలోకి రాని అంశంపై వైకాపా ఎంపీలు అనర్హత పిటిషన్ ఇవ్వడం.. చట్టంపై వారికున్న అజ్ఞానాన్ని బయటపెట్టిందని శాసన మండలి ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు ఎద్దేవా చేశారు. రఘురామకృష్ణరాజుపై అనర్హత పిటిషన్ ఒక డ్రామా అని విమర్శించారు. అనర్హతకు అవకాశమే లేదని స్పష్టం చేశారు.

సభ వెలుపల జరిగిన అంశాల ఆధారంగా అనర్హత వేటు పడదు. రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్​లో ఇది స్పష్టంగా చెప్పారు. విప్​ను ధిక్కరించి ఓటు వేసినా, సభకు గైర్హాజరు అయితే అనర్హత పరిధిలోకి వస్తారు. ఎంపీ రఘరామకృష్ణరాజు విషయంలో ఈ రెండూ జరగలేదు - యనమల రామకృష్ణుడు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.