గాంధీ జయంతి వేడుకల సందర్భంగా వివిధ ప్రాంతాలలో గ్రామ, వార్డు సచివాలయాల ప్రారంభోత్సవాలు ఘనంగా జరిగాయి. గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యాలు వైకాపాతోనే సాధ్యమని మంత్రి ఆదిమూలపు సురేష్ ప్రకాశం జిల్లా మార్కాపురంలో అన్నారు. 13 వ వార్డ్ లో సచివాలయ భవనాన్ని స్థానిక ఎమ్మెల్యే నాగార్జునరెడ్డి తో కలసి మంత్రి ఆదిమూలపు సురేష్ ప్రారంభించారు.
కృష్ణా జిల్లా జగ్గయ్యపేటలో 17వవార్డు సచీవాలయాలన్నీ ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను ప్రారంభించారు. గాంధీజీ కలలుగన్న గ్రామస్వరాజ్యాన్ని ముఖ్యమంత్రి జగన్ సాకారం చేస్తున్నారని ఈ సందర్భంగా అన్నారు.
కడప జిల్లా జమ్మలమడుగు మున్సిపాలిటీ పరిధిలోని 15, 16 వార్డు సంబంధించిన వార్డు సచివాలయ భవనం, మైలవరం, ఎర్రగుంట్ల , ముద్దనూరు మండలాల్లో నూతన వార్డు ,గ్రామ సచివాలయ భవనాలను ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ప్రారంభించారు.
విశాఖ మన్య కేంద్రం పాడేరు సచివాలయంను ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి ప్రారంభించారు.
ప్రకాశం జిల్లా ,గిద్దలూరు పట్టణంలోని ,అర్బన్ కాలనీలో నూతన గ్రామ సచివాలయం కార్యాలయాన్ని ఎమ్మెల్యే అన్న వెంకట్ రాంబాబు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సచివాలయం సంబంధించిన కరపత్రాలను విడుదల విడుదల చేసి 70 మంది పారిశుద్ధ్య కార్మికులకు చీరల పంపిణీ పంపిణీ చేశారు.
ఇదీ చూడండి