ETV Bharat / state

'సీఎం​ గారూ... మమ్మల్ని రాష్ట్రానికి తీసుకెళ్లండి'

author img

By

Published : Apr 29, 2020, 8:05 PM IST

రాజస్థాన్​లోని మౌంట్​ అబూలో... రాష్ట్రానికి చెందిన యాత్రికులు నిలిచిపోయారు. మార్చి 12న అక్కడికి వెళ్లిన వీరంతా లాక్​డౌన్​తో తిరిగిరాలేకపోయారు. రాష్ట్ర ప్రభుత్వం స్పందించి తమను స్వస్థలాలకు తీసుకెళ్లాలని వారు కోరుతున్నారు.

telugu pilgrims stuck in mount abu in rajasthan due to lockdown
telugu pilgrims stuck in mount abu in rajasthan due to lockdown
బాధితుల ఆవేదన

లాక్‌డౌన్‌ కారణంగా రాష్ట్రానికి చెందిన యాత్రికులు... రాజస్థాన్‌లోని మౌంట్ అబూ ప్రజాపిత బ్రహ్మకుమారి ఆధ్యాత్మిక కేంద్రంలో చిక్కుకుపోయారు. గతనెల 23వ తేదీన స్వస్థలాలకు బయలుదేరేందుకు రిజర్వేషన్లు చేసుకున్నప్పటికీ లాక్‌డౌన్‌తో ఎటూ కదల్లేని పరిస్థితి నెలకొంది. సొంతూళ్లు వదిలి సుమారు 50 రోజులు దాటిపోవటంతో అక్కడున్న మహిళలు, వృద్ధులు, రైతు కూలీలు అవస్థలు పడుతున్నారు.

వివిధ జిల్లాలకు చెందిన వీరంతా పెద్ద సంఖ్యలో మార్చి 12వ తేదీన మౌంట్‌ అబూ వెళ్లారు. పది రోజులుపాటు బ్రహ్మకుమారి ఆధ్యాత్మిక కేంద్రంలో ఉండి వెనక్కి వచ్చేందుకు వీలుగా ప్రయాణ ఏర్పాట్లు చేసుకున్నారు. లాక్‌డౌన్‌ ప్రకటనతో అక్కడ ఉండిపోవాల్సి వచ్చింది. తమను స్వగ్రామాలకు తరలించాలని మౌంట్‌ అబూలో నిలిచిపోయిన రాష్ట్ర వాసులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. తమను స్వగ్రామాలకు తరలిస్తే వైద్య పరీక్షలు చేయించుకునేందుకు, క్వారంటైన్‌లో ఉండేందుకు సిద్ధమేనని చెప్పారు.

ఇదీ చదవండి

'కష్ట కాలంలో కేసుల పేరిట వేధింపులేంటి..?'

బాధితుల ఆవేదన

లాక్‌డౌన్‌ కారణంగా రాష్ట్రానికి చెందిన యాత్రికులు... రాజస్థాన్‌లోని మౌంట్ అబూ ప్రజాపిత బ్రహ్మకుమారి ఆధ్యాత్మిక కేంద్రంలో చిక్కుకుపోయారు. గతనెల 23వ తేదీన స్వస్థలాలకు బయలుదేరేందుకు రిజర్వేషన్లు చేసుకున్నప్పటికీ లాక్‌డౌన్‌తో ఎటూ కదల్లేని పరిస్థితి నెలకొంది. సొంతూళ్లు వదిలి సుమారు 50 రోజులు దాటిపోవటంతో అక్కడున్న మహిళలు, వృద్ధులు, రైతు కూలీలు అవస్థలు పడుతున్నారు.

వివిధ జిల్లాలకు చెందిన వీరంతా పెద్ద సంఖ్యలో మార్చి 12వ తేదీన మౌంట్‌ అబూ వెళ్లారు. పది రోజులుపాటు బ్రహ్మకుమారి ఆధ్యాత్మిక కేంద్రంలో ఉండి వెనక్కి వచ్చేందుకు వీలుగా ప్రయాణ ఏర్పాట్లు చేసుకున్నారు. లాక్‌డౌన్‌ ప్రకటనతో అక్కడ ఉండిపోవాల్సి వచ్చింది. తమను స్వగ్రామాలకు తరలించాలని మౌంట్‌ అబూలో నిలిచిపోయిన రాష్ట్ర వాసులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. తమను స్వగ్రామాలకు తరలిస్తే వైద్య పరీక్షలు చేయించుకునేందుకు, క్వారంటైన్‌లో ఉండేందుకు సిద్ధమేనని చెప్పారు.

ఇదీ చదవండి

'కష్ట కాలంలో కేసుల పేరిట వేధింపులేంటి..?'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.