రాష్ట్ర ప్రభుత్వం తక్షణం మద్యం షాపులు మూసివేయాలని కోరుతూ కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలం అనుమంచిపల్లి గ్రామంలో తెదేపా ఆధ్వర్యంలో తెలుగు మహిళలు దీక్ష చేపట్టారు. అంతేకాక ప్రతీ పేద కుటుంబానికి 5వేలు ఆర్థిక సహాయం చేయాలని కోరారు. రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించాలన్నారు. అన్నా క్యాంటీన్లు తెరవాలని కోరారు. అమరావతినే రాజధానిగా కొనసాగించాలని డిమాండ్ చేశారు. ఈ దీక్షకు జగ్గయ్యపేట మాజీ ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ తాతయ్య సంఘీభావం తెలిపారు.
ఇదీ చదవండి: 'బ్లీచింగ్ పేరుతో నాసిరకం సున్నం సరఫరా'