మంత్రి శ్రీరంగనాథరాజు వ్యాఖ్యలకు నిరసనగా తెదేపా రైతు విభాగం అధ్యక్షుడు మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో విజయవాడలోని ఎన్టీఆర్ భవన్ వద్ద ఆయన చిత్రపటం దహనం చేశారు. వరిసాగు సోమరిపోతు వ్యవసాయం అంటూ మంత్రి చేసిన వ్యాఖ్యల పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే రైతాంగానికి మంత్రి క్షమాపణ చెప్పాలని మర్రెడ్డి డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి తక్షణమే రంగనాథరాజును మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు.
ఇవీ చదవండి