ETV Bharat / state

అధునాతన ఇంజనీరింగ్ నైపుణ్యాలపై యువతకు శిక్షణ

యువతలో నైపుణ్యాలు పెంచి మంచి ఉద్యోగం సాధించేందుకు అవసరమైన తోడ్పాటు అందించేందుకు నూజివీడు ట్రిపుల్ ఐటీలో ప్రత్యేక శిక్షణ ఏర్పాటు చేశారు. ఏపీఎస్​ఎస్​డీసీ ఆధ్వర్యంలో నెలరోజుల పాటు వీటిని నిర్వహించనున్నారు.

author img

By

Published : Jun 4, 2019, 10:58 PM IST

యువతకు చేయూత
యువతకు చేయూత

కృష్ణా జిల్లా నూజివీడు త్రిబుల్ ఐటీలో అధునాతన ఇంజనీరింగ్ నైపుణ్యాలపై శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఏపీఎస్​ఎస్​డీసీ ఆధ్వర్యంలో నెలరోజుల పాటు జరిగే శిక్షణలో విద్యార్థులకు ఇంజనీరింగ్ నైపుణ్యాలను నేర్పించనున్నారు. 210 మంది ఏపీఎస్​ఎస్​డీసీ ట్రైనీలు, 31 మంది ఆర్​జేకేయూటీ నూజివీడు విద్యార్థులకు ఈ శిక్షణ ఇవ్వనున్నారు. యువతకు ఎంతగానో ఉపయోగపడే ఈ శిక్షణ కార్యక్రమాన్ని నూజివీడు ప్రాంగణంలో ఏర్పాటు చేసినందుకు నూజివీడు ట్రిపుల్ ఐటీ డైరెక్టర్ సూర్యచంద్రరావు కృతజ్ఞతలు తెలిపారు. ఈ శిక్షణా తరగతులు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు జరుగుతాయని అన్నారు. ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ స్పెషల్ చీఫ్ సెక్యూరిటీ ఫర్ లేబర్ ఎంప్లాయిమెంట్ జేఎస్​వీ ప్రసాద్ హాజరయ్యారు. విద్యార్థులకు కీలక సూచనలు చేశారు. ఇలాంటి శిక్షణ కార్యక్రమాలు పూర్తి స్థాయిలో సార్థకం అవ్వాలంటే ప్రతి విద్యార్థి ఆలోచనా తీరు, ప్రవర్తనలో మార్పులు రావాలని అన్నారు. ఆర్​జేకేయూటీ ప్రాంగణాల ఉపకులపతి ఆచార్య రామచంద్రరాజు, ఉన్నత విద్యా శాఖ ప్రధాన కార్యదర్శి దమయంతి పాల్గొన్నారు.

యువతకు చేయూత

కృష్ణా జిల్లా నూజివీడు త్రిబుల్ ఐటీలో అధునాతన ఇంజనీరింగ్ నైపుణ్యాలపై శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఏపీఎస్​ఎస్​డీసీ ఆధ్వర్యంలో నెలరోజుల పాటు జరిగే శిక్షణలో విద్యార్థులకు ఇంజనీరింగ్ నైపుణ్యాలను నేర్పించనున్నారు. 210 మంది ఏపీఎస్​ఎస్​డీసీ ట్రైనీలు, 31 మంది ఆర్​జేకేయూటీ నూజివీడు విద్యార్థులకు ఈ శిక్షణ ఇవ్వనున్నారు. యువతకు ఎంతగానో ఉపయోగపడే ఈ శిక్షణ కార్యక్రమాన్ని నూజివీడు ప్రాంగణంలో ఏర్పాటు చేసినందుకు నూజివీడు ట్రిపుల్ ఐటీ డైరెక్టర్ సూర్యచంద్రరావు కృతజ్ఞతలు తెలిపారు. ఈ శిక్షణా తరగతులు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు జరుగుతాయని అన్నారు. ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ స్పెషల్ చీఫ్ సెక్యూరిటీ ఫర్ లేబర్ ఎంప్లాయిమెంట్ జేఎస్​వీ ప్రసాద్ హాజరయ్యారు. విద్యార్థులకు కీలక సూచనలు చేశారు. ఇలాంటి శిక్షణ కార్యక్రమాలు పూర్తి స్థాయిలో సార్థకం అవ్వాలంటే ప్రతి విద్యార్థి ఆలోచనా తీరు, ప్రవర్తనలో మార్పులు రావాలని అన్నారు. ఆర్​జేకేయూటీ ప్రాంగణాల ఉపకులపతి ఆచార్య రామచంద్రరాజు, ఉన్నత విద్యా శాఖ ప్రధాన కార్యదర్శి దమయంతి పాల్గొన్నారు.

Intro:ప్రజల పక్షాన పనిచేద్దామని శ్రీకాకుళం పార్లమెంటు సభ్యుడు కింజరాపు రామ్మోహన్ నాయుడు, టెక్కలి శాసనసభ్యుడు కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. సార్వత్రిక ఎన్నికల ఫలితాల అనంతరం టెక్కలి లోని తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి తొలిసారి వచ్చిన వారికి పార్టీ కార్యకర్తలు, నాయకులు ఘనస్వాగతం పలికారు. టెక్కలి, నందిగాం మండలాల నుంచి పెద్దఎత్తున తరలి వచ్చిన కార్యకర్తలు మర్యాద పూర్వకంగా కలసి శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రమంతా వైకాపా గాలి వీచినా తమను గెలుపించేందుకు కార్యకర్తలు సైనికుల్లా పనిచేశారని కొనియాడారు. నిరంతరం ప్రజల మధ్య ఉంటూ సేవాలందించాలని కార్యకర్తలకు సూచించారు.


Body:టెక్కలి


Conclusion:విక్రమ్, టెక్కలి, శ్రీకాకుళం జిల్లా
8008574284
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.