కృష్ణా జిల్లా మచిలీపట్నం ఆర్టీసీ డిపోకు చెందిన డ్రైవర్.. నిర్లక్ష్యంగా బస్సు నడపిన వైనంపై ఆర్టీసీ చర్యలు చేపట్టింది. డ్రైవర్ వీరభద్రరావు ఈ నెల 3న విజయవాడ నుంచి మచిలీపట్నం వరకు నాన్ స్టాప్ బస్సు నడిపారు. ఈ క్రమంలో సెల్ ఫోన్లో చాటింగ్ చేస్తూ, పుస్తకం చదువుతూ డ్రైవింగ్ చేశారు. గమనించిన ప్రయాణికులు తీరు మార్చుకోవాలని చెప్పినా పెడచెవిన పెట్టారు. ఆందోళనకు గురైన ప్రయాణికులు ఆధారాలతో సహా ఆర్టీసీ ఎండీ ఆర్పీ ఠాకూర్కు ఫిర్యాదు చేశారు.
ఘటనపై విచారణకు ఆదేశించిన ఎండీ... ఫిర్యాదు నిజమేనని తేలిన మేరకు.. డ్రైవర్ను విధుల నుంచి తప్పించాలని అధికారులను ఆదేశించారు. ఈ మేరకు చర్యలు చేపడుతూ.. కృష్ణా జిల్లా ఆర్టీసీ ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. సంస్థలో ఎక్కడా పనిచేసేందుకు అవకాశం లేకుండా చర్యలు తీసుకున్నారు.
ఇదీ చదవండి: