కృష్ణాజిల్లా వీరులపాడు మండలం పెద్దాపురం వద్ద తెలంగాణ నుంచి అక్రమంగా తరలిస్తున్న మద్యాన్ని స్పెషల్ ఎన్ఫోర్స్ మెంట్ అధికారులు, పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. చెక్పోస్ట్ల వద్ద వాహనాల తనిఖీలు చేపట్టిన పోలీసులు ద్విచక్రవాహనాలపై తరలిస్తున్న 645 బాటిళ్ల మద్యాన్ని పట్టుకున్నారు. ఈ వాహన తనిఖీలలో స్పెషల్ ఎన్ఫోర్స్ మెంట్ అధికారి వకుల్ జిందాల్ పాల్గొన్నారు. పట్టుబడ్డ మద్యం విలువ దాదాపు రూ.77వేలు ఉంటుందని అన్నారు.
ఇదీ చూడండి. సచివాలయంలో ఉద్యోగుల పదోన్నతులు ఎప్పుడో..?