ETV Bharat / state

తెలంగాణ: నాలాలు ఉన్నచోట.. పోలీసుల సూచనలు

author img

By

Published : Sep 19, 2020, 8:27 PM IST

తెలంగాణ మేడ్చల్​ జిల్లా నేరెడ్​మెట్​ దీనదయాళ్​ నగర్​ నాలాలో పడి 12 సంవత్సరాల సుమేధ అనే బాలిక మృతి చెందిన ఘటన అనంతరం నేరెడ్​మెట్​ పోలీసులు అప్రమత్తమయ్యారు. నేరెడ్​మెట్​లోని పలు ప్రాంతాల్లో నిల్చొని అటువైపు వస్తున్న వారికి జాగ్రత్తగా వెళ్లాలని సూచనలు ఇస్తున్నారు.

Neredmet
తెలంగాణలో నాలాలు ఉన్నచోట.. పోలీసుల సూచనలు
తెలంగాణలో నాలాలు ఉన్నచోట.. పోలీసుల సూచనలు

తెలంగాణ మేడ్చల్​ జిల్లా నేరెడ్​మెట్​ పరిధిలోని దీనదయాళ్​ నగర్​లో నాలాలో పడి 12 సంవత్సరాల సుమేధ అనే బాలిక చనిపోయిన తర్వాత పోలీసులు అప్రమత్తమయ్యారు. కొద్దిపాటి వర్షానికే మోకాలి లోతు నీళ్లు చేరి.. నాలా ఎక్కడుందో.. గుంత ఎక్కడుందో.. మ్యాన్​హోల్​ ఎక్కడుందో తెలియని ప్రాంతాలు హైదరాబాద్​లో చాలా ఉన్నాయి. నేరెడ్​మెట్​లోని సుమేధ ఘటన జరిగిన ప్రదేశంలో వర్షం లేనప్పుడు నాలా ఎప్పుడూ తెరిచే ఉండేది. నివాస ప్రాంతాల్లో నాలా తెరిచి ఉంచిన అధికారుల నిర్లక్ష్యం కారణంగా ముక్కుపచ్చలారని బాలిక మృత్యువాత పడింది. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ సంఘటనతో అప్రమత్తమైన నేరెడ్​మెట్​ పోలీసులు వరద నీరు ప్రవహిస్తున్న ప్రాంతాల్లో నిల్చొని.. నాలా ఉన్నవైపు జనాలు వెళ్లకుండా అప్రమత్తం చేస్తున్నారు.

నిత్యం కురుస్తున్న వర్షాల కారణంగా రోడ్డు మీద వరద నీళ్లు ప్రవహిస్తూ.. నాలాలు, గుంతలు కనిపించని పరిస్థితి ఉందని.. ప్రజలు రోడ్డు మీద నడిచేటప్పుడు జాగ్రత్తలు పాటిస్తూ.. అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.

ఇదీ చూడండి : ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా ఉత్సవాలు: మంత్రి వెల్లంపల్లి

తెలంగాణలో నాలాలు ఉన్నచోట.. పోలీసుల సూచనలు

తెలంగాణ మేడ్చల్​ జిల్లా నేరెడ్​మెట్​ పరిధిలోని దీనదయాళ్​ నగర్​లో నాలాలో పడి 12 సంవత్సరాల సుమేధ అనే బాలిక చనిపోయిన తర్వాత పోలీసులు అప్రమత్తమయ్యారు. కొద్దిపాటి వర్షానికే మోకాలి లోతు నీళ్లు చేరి.. నాలా ఎక్కడుందో.. గుంత ఎక్కడుందో.. మ్యాన్​హోల్​ ఎక్కడుందో తెలియని ప్రాంతాలు హైదరాబాద్​లో చాలా ఉన్నాయి. నేరెడ్​మెట్​లోని సుమేధ ఘటన జరిగిన ప్రదేశంలో వర్షం లేనప్పుడు నాలా ఎప్పుడూ తెరిచే ఉండేది. నివాస ప్రాంతాల్లో నాలా తెరిచి ఉంచిన అధికారుల నిర్లక్ష్యం కారణంగా ముక్కుపచ్చలారని బాలిక మృత్యువాత పడింది. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ సంఘటనతో అప్రమత్తమైన నేరెడ్​మెట్​ పోలీసులు వరద నీరు ప్రవహిస్తున్న ప్రాంతాల్లో నిల్చొని.. నాలా ఉన్నవైపు జనాలు వెళ్లకుండా అప్రమత్తం చేస్తున్నారు.

నిత్యం కురుస్తున్న వర్షాల కారణంగా రోడ్డు మీద వరద నీళ్లు ప్రవహిస్తూ.. నాలాలు, గుంతలు కనిపించని పరిస్థితి ఉందని.. ప్రజలు రోడ్డు మీద నడిచేటప్పుడు జాగ్రత్తలు పాటిస్తూ.. అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.

ఇదీ చూడండి : ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా ఉత్సవాలు: మంత్రి వెల్లంపల్లి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.