ETV Bharat / state

ఎనిమిది నెలల బాలుడి కిడ్నాప్ కథ సుఖాంతం - police arrest kidnapers at jaipur

అప్పు తీర్చలేదని బాలుణ్ని ఎత్తుకెళ్లిన వారిని జైపూర్​లో పోలీసులు అదుపులోకి తీసుకోవటంతో  కథ సుఖాంతమైంది.

కిడ్నాప్ కథ సుఖాంతం
author img

By

Published : Sep 20, 2019, 10:15 AM IST

చేసిన అప్పు తీర్చలేదని బాలుణ్ని ఎత్తుకెళ్లిన వ్యక్తులను పోలీసులు జైపూర్​లో అదుపులోకి తీసుకొని, బాలుడిని విజయవాడకు తీసుకొస్తున్నారు. జైపూర్​ నుంచి వలస వచ్చి విజయవాడలో నివాసం ఉంటున్న సోను దంపతులకు ఎనిమిది నెలల బాలుడు ఉన్నాడు. సోను, జైపూర్​కు చెందిన చాను దంపతుల నుంచి 36 వేల నగదు అప్పుగా తీసుకొని చెల్లించలేదు. ఈ క్రమంలో గొడవ కూడా జరిగింది. ఆవేశంతో చాను ఈ నెల 17న విజయవాడ వచ్చి బాలుడిని జైపూర్​కు ఎత్తుకెళ్లిపోయారు. బాధితులు వెంటనే ఆత్కూరు పోలీసు స్టేషన్​ను ఆశ్రయించారు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు హుటాహుటిన జైపూర్​ వెళ్లారు. సెల్​ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా నిందింతులను ఎప్పటికప్పుడు ట్రాక్ చేస్తూ కిడ్నాపర్ల కంటే ముందే జైపూర్​ చేరుకున్నారు. విజయవాడ రైల్వే స్టేషన్ నుంచి మన్నార్ గుడి ఎక్స్​ప్రెస్​లో జైపూర్​కు బయల్దేరిన నిందితులను ట్రాన్స్​పోర్ట్ నగర్​ అదుపులోకి తీసుకున్నారు. అంతా కలిసి రైలులో విజయవాడ వస్తున్నారు. కిడ్నాప్ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకొని ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి కేవలం 40 గంటల్లోనే నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు సీపీ ద్వారకా తిరుమలరావు వివరించారు.

చేసిన అప్పు తీర్చలేదని బాలుణ్ని ఎత్తుకెళ్లిన వ్యక్తులను పోలీసులు జైపూర్​లో అదుపులోకి తీసుకొని, బాలుడిని విజయవాడకు తీసుకొస్తున్నారు. జైపూర్​ నుంచి వలస వచ్చి విజయవాడలో నివాసం ఉంటున్న సోను దంపతులకు ఎనిమిది నెలల బాలుడు ఉన్నాడు. సోను, జైపూర్​కు చెందిన చాను దంపతుల నుంచి 36 వేల నగదు అప్పుగా తీసుకొని చెల్లించలేదు. ఈ క్రమంలో గొడవ కూడా జరిగింది. ఆవేశంతో చాను ఈ నెల 17న విజయవాడ వచ్చి బాలుడిని జైపూర్​కు ఎత్తుకెళ్లిపోయారు. బాధితులు వెంటనే ఆత్కూరు పోలీసు స్టేషన్​ను ఆశ్రయించారు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు హుటాహుటిన జైపూర్​ వెళ్లారు. సెల్​ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా నిందింతులను ఎప్పటికప్పుడు ట్రాక్ చేస్తూ కిడ్నాపర్ల కంటే ముందే జైపూర్​ చేరుకున్నారు. విజయవాడ రైల్వే స్టేషన్ నుంచి మన్నార్ గుడి ఎక్స్​ప్రెస్​లో జైపూర్​కు బయల్దేరిన నిందితులను ట్రాన్స్​పోర్ట్ నగర్​ అదుపులోకి తీసుకున్నారు. అంతా కలిసి రైలులో విజయవాడ వస్తున్నారు. కిడ్నాప్ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకొని ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి కేవలం 40 గంటల్లోనే నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు సీపీ ద్వారకా తిరుమలరావు వివరించారు.

ఇదీ చదవండి: అప్పు తీర్చలేదని.... బిడ్డ అపహరణ

Intro:Body:నరసన్నపేటConclusion:9440319788
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.