గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డు కార్యక్రమంలో కృష్ణా జిల్లా మైలవరం సాయిబాబా మందిరం పాల్గొంది. బాబాకు హారతులు ఇవ్వటం మొదలు పెట్టి నేటికీ 110 సంవత్సరాలు పూర్తి చేసుకుని..... 111వ సంవత్సరంలోకి అడుగు పెట్టింది. ఈ సందర్భంగా... ప్రపంచవ్యాప్తంగా ఉన్న 111 దేవాలయాల్లో ఒక్కొక్క ఆలయానికి 111 మంది హారతులు ఇవ్వనున్నారు. సాయి గ్లోబల్ ఆర్తి 2020... గిన్నిస్ బుక్ రికార్డ్ ఈవెంట్ ప్రోగ్రాం నిర్వహించు ఈ కార్యక్రమంలో మైలవరంలోని స్థానిక సాయిబాబా మందిరంలో 111 మంది భక్తుల చేత హారతులు ఇవ్వనున్నట్లు ఆలయ నిర్వాహకులు బాలాజీ ప్రసాద్ తెలియజేశారు.
ఇదీ చదవండి: