ETV Bharat / state

ఎస్సై మానవత్వం... కరోనాతో చనిపోయిన వ్యక్తి మృతదేహానికి అంత్యక్రియలు

author img

By

Published : May 10, 2021, 3:49 PM IST

కృష్ణా జిల్లా ముసునూరు ఎస్సై మానవత్వం చాటుకున్నారు. కరోనాతో మృతి చెందిన వ్యక్తికి అంతిమ సంస్కారాలు నిర్వహించారు.

musunooru si doing funerals of corona dead body
కరోనా మృతదేహానికి అంత్యక్రియలు

కృష్ణా జిల్లా ముసునూరు మండల పరిధిలోని గోపవరం గ్రామానికి చెందిన ఓ వ్యక్తి కరోనాతో మృతి చెందాడు. ఇతని భార్యకూ కరోనా సోకగా.. 2 రోజులు క్రితం ఆమె చనిపోయింది. కుమారుడు కూడా వైరస్​కు చిక్కి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.

ఈ క్రమంలో మృతదేహాన్ని తరలించేందుకు ఎవరూ ముందుకు రాలేదు. ముసునూరు ఎస్సై రాజారెడ్డి, తన సిబ్బందితో కలిసి కొవిడ్ జాగ్రత్తలు పాటిస్తూ... మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించారు. అనంతరం పరిసరాలను శానిటైజ్ చేయించారు.

కృష్ణా జిల్లా ముసునూరు మండల పరిధిలోని గోపవరం గ్రామానికి చెందిన ఓ వ్యక్తి కరోనాతో మృతి చెందాడు. ఇతని భార్యకూ కరోనా సోకగా.. 2 రోజులు క్రితం ఆమె చనిపోయింది. కుమారుడు కూడా వైరస్​కు చిక్కి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.

ఈ క్రమంలో మృతదేహాన్ని తరలించేందుకు ఎవరూ ముందుకు రాలేదు. ముసునూరు ఎస్సై రాజారెడ్డి, తన సిబ్బందితో కలిసి కొవిడ్ జాగ్రత్తలు పాటిస్తూ... మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించారు. అనంతరం పరిసరాలను శానిటైజ్ చేయించారు.

ఇదీ చదవండి:

చంద్రబాబు రాష్ట్రానికి సీఎం అని వైకాపా నేతలు భావిస్తున్నారా?: తెదేపా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.