కృష్ణా జిల్లాలో 2 లక్షల 70 వేల మందికి ఉగాది నాటికి ఇళ్ల స్థలాలు ఇవ్వాలని... ప్రభుత్వం నిర్ణయించినట్లు కలెక్టర్ ఇంతియాజ్ అహ్మద్ తెలిపారు. నందిగామ తహసీల్దారు కార్యాలయంలో ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్రావుతో కలిసి ఇళ్ల స్థలాల పంపిణీపై పాలనాధికారి సమీక్ష నిర్వహించారు. వైఎస్ఆర్ నవశకం కింద గ్రామాల్లో సర్వే జరుగుతోందన్నారు. అర్హుల జాబితాను గ్రామ సచివాలయాల్లో ప్రదర్శిస్తామని కలెక్టర్ తెలిపారు. ఇళ్ల స్థలాలు, పట్టా గృహాలు అందజేయాలనేది ప్రభుత్వ ఉద్దేశమని పేర్కొన్నారు.
ఇదీ చదవండి: కొండపల్లి ఖిల్లా వద్ద వక్ఫ్బోర్డు స్థలాల ఆక్రమణ!