ETV Bharat / state

'సామాజిక అవసరాలు తీర్చే పరిశోధనలు కావాలి'

కరోన మహమ్మారి కారణంగా ప్రపంచం మొత్తం ఎన్నడూ ఊహించని సవాళ్ళను ఎదుర్కుంటుందని శాస్త్రవేత్త పద్మవిభూషణ్‌ రఘునాథ్‌ అనంత్‌ మషేల్కర్ అన్నారు. ‌కేఎల్‌ డీమ్డ్‌ విశ్వవిద్యాలయం 9, 10 స్నాతకోత్సవం ఘనంగా నిర్వహించారు. వర్చువల్‌ పద్ధతిలో పుణె నుంచి ముఖ్య అతిథిగా డాక్టర్‌ రఘునాథ్‌ స్నాతకోపన్యాసం చేశారు. సామాజిక అవసరాలు తీర్చే పరిశోధనలు కావాలన్నారు.

author img

By

Published : Dec 24, 2020, 12:13 PM IST

KL University Convocation
KL University Convocation

సామాజిక అవసరాలు తీర్చగలిగే పరిశోధనలు అవసరమని భారత జాతీయ సైన్స్‌ అకాడమీ అధ్యక్షుడు, శాస్త్రవేత్త పద్మవిభూషణ్‌ డాక్టర్‌ రఘునాథ్‌ అనంత్‌ మషేల్కర్‌ అన్నారు. కేఎల్‌ డీమ్డ్‌ విశ్వవిద్యాలయం తొమ్మిది, పదో స్నాతకోత్సవం బుధవారం విశ్వవిద్యాలయ ఆవరణలో నిర్వహించారు. వర్చువల్‌ పద్ధతిలో పుణె నుంచి ముఖ్య అతిథిగా డాక్టర్‌ రఘునాథ్‌ స్నాతకోపన్యాసం చేశారు. కరోనా వైరస్‌ కారణంగా ఏర్పడిన వినాశనాన్ని సరిదిద్దడంతోపాటు దేశాన్ని అభివృద్ధి దిశగా తీసుకువెళ్లాల్సిన బాధ్యత విద్యార్థులపై ఉందన్నారు.

పరిశోధనల కోసం కేంద్రం రూ.వేల కోట్ల నిధులు కేటాయిస్తోందన్నారు. మరో శాస్త్రవేత్త పద్మవిభూషణ్‌ విజయ్‌భత్కర్‌ మాట్లాడుతూ సాంకేతికతను సాధించాలంటే పట్టుదల, క్రమశిక్షణ అవసరమన్నారు. ఇంజినీరింగ్‌లో కొత్త ఆవిష్కరణలకు విద్యార్థులు తెర తీయాలన్నారు. విశ్వవిద్యాలయం అధ్యక్షుడు కోనేరు సత్యనారాయణ మాట్లాడుతూ విద్యార్థుల ద్వారా ప్రపంచ జీవన గమనాన్ని మార్చగలిగే పరిశోధనలు నిర్వహిస్తున్నామన్నారు. ప్రజలు ఎదుర్కొంటున్న కీలక సమస్యల పరిష్కారానికి ఉపయోగపడే పరిశోధనలు విశ్వవిద్యాలయం చేపట్టిందన్నారు.

కేఎల్‌యూ ఛాన్స్‌లర్‌ డాక్టర్‌ ఎస్‌ఎస్‌ మంథా, ఉపాధ్యక్షుడు కోనేరు రాజాహరీన్‌, ఉపకులపతి డాక్టర్‌ ఎల్‌ఎస్‌ఎస్‌రెడ్డి, రిజిస్ట్రార్‌ డాక్టర్‌ ప్రసాదరావు, ఆచార్యులు పాల్గొన్నారు. స్నాతకోత్సవం సందర్భంగా 7,620 మంది విద్యార్థులకు డిగ్రీలను ప్రదానం చేశారు. ఇంజినీరింగ్‌లో ప్రతిభ కనబరిచిన 80 మంది విద్యార్థులకు బంగారు పతకాలతోపాటు నగదు పురస్కారాలు అందజేశారు. శాస్త్రవేత్తలు పద్మవిభూషణ్‌ డాక్టర్‌ రఘునాథ్‌ మషేల్కర్‌, పద్మ విభూషణ్‌ డాక్టర్‌ విజయ్‌భత్కర్‌, యూనివర్శిటీ గ్రాంట్స్‌ కమిషన్‌ సంయుక్త కార్యదర్శి డాక్టర్‌ అవిచల్‌కపూర్‌లకు విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్లు ప్రదానం చేసింది.

సామాజిక అవసరాలు తీర్చగలిగే పరిశోధనలు అవసరమని భారత జాతీయ సైన్స్‌ అకాడమీ అధ్యక్షుడు, శాస్త్రవేత్త పద్మవిభూషణ్‌ డాక్టర్‌ రఘునాథ్‌ అనంత్‌ మషేల్కర్‌ అన్నారు. కేఎల్‌ డీమ్డ్‌ విశ్వవిద్యాలయం తొమ్మిది, పదో స్నాతకోత్సవం బుధవారం విశ్వవిద్యాలయ ఆవరణలో నిర్వహించారు. వర్చువల్‌ పద్ధతిలో పుణె నుంచి ముఖ్య అతిథిగా డాక్టర్‌ రఘునాథ్‌ స్నాతకోపన్యాసం చేశారు. కరోనా వైరస్‌ కారణంగా ఏర్పడిన వినాశనాన్ని సరిదిద్దడంతోపాటు దేశాన్ని అభివృద్ధి దిశగా తీసుకువెళ్లాల్సిన బాధ్యత విద్యార్థులపై ఉందన్నారు.

పరిశోధనల కోసం కేంద్రం రూ.వేల కోట్ల నిధులు కేటాయిస్తోందన్నారు. మరో శాస్త్రవేత్త పద్మవిభూషణ్‌ విజయ్‌భత్కర్‌ మాట్లాడుతూ సాంకేతికతను సాధించాలంటే పట్టుదల, క్రమశిక్షణ అవసరమన్నారు. ఇంజినీరింగ్‌లో కొత్త ఆవిష్కరణలకు విద్యార్థులు తెర తీయాలన్నారు. విశ్వవిద్యాలయం అధ్యక్షుడు కోనేరు సత్యనారాయణ మాట్లాడుతూ విద్యార్థుల ద్వారా ప్రపంచ జీవన గమనాన్ని మార్చగలిగే పరిశోధనలు నిర్వహిస్తున్నామన్నారు. ప్రజలు ఎదుర్కొంటున్న కీలక సమస్యల పరిష్కారానికి ఉపయోగపడే పరిశోధనలు విశ్వవిద్యాలయం చేపట్టిందన్నారు.

కేఎల్‌యూ ఛాన్స్‌లర్‌ డాక్టర్‌ ఎస్‌ఎస్‌ మంథా, ఉపాధ్యక్షుడు కోనేరు రాజాహరీన్‌, ఉపకులపతి డాక్టర్‌ ఎల్‌ఎస్‌ఎస్‌రెడ్డి, రిజిస్ట్రార్‌ డాక్టర్‌ ప్రసాదరావు, ఆచార్యులు పాల్గొన్నారు. స్నాతకోత్సవం సందర్భంగా 7,620 మంది విద్యార్థులకు డిగ్రీలను ప్రదానం చేశారు. ఇంజినీరింగ్‌లో ప్రతిభ కనబరిచిన 80 మంది విద్యార్థులకు బంగారు పతకాలతోపాటు నగదు పురస్కారాలు అందజేశారు. శాస్త్రవేత్తలు పద్మవిభూషణ్‌ డాక్టర్‌ రఘునాథ్‌ మషేల్కర్‌, పద్మ విభూషణ్‌ డాక్టర్‌ విజయ్‌భత్కర్‌, యూనివర్శిటీ గ్రాంట్స్‌ కమిషన్‌ సంయుక్త కార్యదర్శి డాక్టర్‌ అవిచల్‌కపూర్‌లకు విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్లు ప్రదానం చేసింది.

ఇదీ చదవండి:

పశ్చిమ బంగాల్​లో తెలుగు వెలుగులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.