ETV Bharat / state

ఘనంగా గంగాభవాని గ్రామోత్సవం... పోలీస్​స్టేషన్​లో అమ్మవారికి పూజలు - కోడూరు పోలీస్​స్టేషన్​లో పూజలు

గంగాభవాని అమ్మవారి జాతర.. పోలీస్​ స్టేషన్​లో ఘనంగా జరిగింది. కృష్ణాజిల్లా కోడూరు మండల కేంద్రంలో జరిగిన ఈ జాతరలో.. ఎస్సై రమేష్ దంపతులు, అవనిగడ్డ డీఎస్పీ మహబూబ్ భాషా, సీఐలు రవికుమార్, వెంకట నారాయణ పాల్గొన్నారు. ఈనెల 14న ప్రధాన గుడి దగ్గర జాతర జరగనుంది.

gangabhavani jatara in koduru, poojas in koduru police station
కోడూరులో గంగాభవాని గ్రామోత్సవం, కోడూరు పోలీస్​స్టేషన్​లో పూజలు
author img

By

Published : Apr 10, 2021, 7:33 PM IST

కృష్ణా జిల్లా కోడూరు మండలం కేంద్రంలో కంచెర్లపల్లి వంశీయుల ఆడపడుచు గంగా భవాని అమ్మవారి జాతర అంగరంగ వైభవంగా జరుగుతోంది. మొదటగా వారి ఇంటి వద్ద అమ్మవారి పట్టు వస్త్రాలు, ఆయుధాలకు పసుపు, కుంకుమలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం డప్పు కళాకారులతో ఊరేగింపుగా బయలుదేరి.. గంగానమ్మ గుడి వద్ద అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు.

ఇదీ చదవండి: క్షుద్రపూజల పేరిట యువతిపై అత్యాచారం

గ్రామోత్సవంలో భాగంగా.. తొలిపూజ కోసం అమ్మవారిని స్థానిక పోలీస్ స్టేషన్​కు మేళ తాళాలతో తీసుకువెళ్లి పూజలు నిర్వహించారు. అమ్మవారి ఆలయాన్ని 45 ఏళ్ల క్రితం అప్పటి కోడూరు స్టేషన్ ఎస్సై ఏవీఎస్ రెడ్డి అభివృద్ధి చేయడంతో.. ఈ పూజ అక్కడ ఆనవాయితీగా వస్తోంది. ఆలయంలో, పోలీస్ స్టేషన్​లో కోడూరు ఎస్సై రమేష్ దంపతులు పూజలు నిర్వహించారు. అవనిగడ్డ డీఎస్పీ మహబూబ్ భాషా, సీఐలు బీబీ రవికుమార్, వెంకట నారాయణతో పాటు పెద్ద సంఖ్యలో భక్తులు జాతరలో పాల్గొన్నారు. ఈనెల 14న అమ్మవారి ప్రధాన గుడి వద్ద జాతర జరగనున్న నేపథ్యంలో.. నేటి నుంచి ఇంటింటికీ ఊరేగింపు ప్రారంభమైంది.

కృష్ణా జిల్లా కోడూరు మండలం కేంద్రంలో కంచెర్లపల్లి వంశీయుల ఆడపడుచు గంగా భవాని అమ్మవారి జాతర అంగరంగ వైభవంగా జరుగుతోంది. మొదటగా వారి ఇంటి వద్ద అమ్మవారి పట్టు వస్త్రాలు, ఆయుధాలకు పసుపు, కుంకుమలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం డప్పు కళాకారులతో ఊరేగింపుగా బయలుదేరి.. గంగానమ్మ గుడి వద్ద అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు.

ఇదీ చదవండి: క్షుద్రపూజల పేరిట యువతిపై అత్యాచారం

గ్రామోత్సవంలో భాగంగా.. తొలిపూజ కోసం అమ్మవారిని స్థానిక పోలీస్ స్టేషన్​కు మేళ తాళాలతో తీసుకువెళ్లి పూజలు నిర్వహించారు. అమ్మవారి ఆలయాన్ని 45 ఏళ్ల క్రితం అప్పటి కోడూరు స్టేషన్ ఎస్సై ఏవీఎస్ రెడ్డి అభివృద్ధి చేయడంతో.. ఈ పూజ అక్కడ ఆనవాయితీగా వస్తోంది. ఆలయంలో, పోలీస్ స్టేషన్​లో కోడూరు ఎస్సై రమేష్ దంపతులు పూజలు నిర్వహించారు. అవనిగడ్డ డీఎస్పీ మహబూబ్ భాషా, సీఐలు బీబీ రవికుమార్, వెంకట నారాయణతో పాటు పెద్ద సంఖ్యలో భక్తులు జాతరలో పాల్గొన్నారు. ఈనెల 14న అమ్మవారి ప్రధాన గుడి వద్ద జాతర జరగనున్న నేపథ్యంలో.. నేటి నుంచి ఇంటింటికీ ఊరేగింపు ప్రారంభమైంది.

ఇదీ చదవండి:

తక్కువ వడ్డీకే రుణాలిప్పిస్తానని మోసం..రూ.4.5 కోట్లకు టోపీ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.