18 లక్షల వ్యవసాయ పంపు సెట్లకు మీటర్ పెట్టి.. విద్యుత్ రంగంపై 2వేలకోట్ల భారం పెంచడం అవసరమా? అని మాజీ మంత్రి దేవినేని ఉమా మండిపడ్డారు. రైతులు వ్యతిరేకిస్తున్నా మీటర్ బిగింపు వెనక మతలబేంటని ప్రశ్నించారు. ఉచిత విద్యుత్కి మంగళం పాడేందుకేనా ఈ మీటర్లని ఆయన ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో నగదు బదిలీని వైకాపా వ్యతిరేకించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. రైతులు, నిపుణులు అడుగుతున్న ప్రశ్నలకు జగన్ సమాధానం చెప్పాలని ఉమా డిమాండ్ చేశారు.
ఇదీ చూడండి. 'ఎడగారు' ధాన్య సేకరణ సమస్యకు మంత్రి మేకపాటి పరిష్కారం