రెవెన్యూ వ్యవస్థను నాశనం చేసి 90 శాతం పార్టీ కార్యకర్తలకు ఉద్యోగాలిచ్చుకున్న వాళ్లతో ఇంటింటికీ రేషన్ పంపిణీ చేయొచ్చని దేవినేని ఉమా సూచించారు. క్షేత్రస్థాయిలో ఏం జరుగుతోందో తెలుసుకోవాలని హితవు పలికారు. ఆడవాళ్లు నిత్యావసరాల కోసం బయటకు వస్తుంటే ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. నిత్యావసరాల కోసం ప్రజలు క్యూలైన్లలో నిలబడిన ప్రాంతాల్లో పర్యటించిన ఉమా.. పేదవాడికి ఉచితంగా ఇవ్వాల్సిన పరిస్థితుల్లో పంచదార, గోధుమ పిండిపై 30 రూపాయలు వసూలు చేయటం సరికాదన్నారు. ఏవేవో కారణాలు చెప్పి ఉదయం 4గంటల నుంచి 11గంటల వరకూ క్యూలో నిలబెట్టి మరుసటిరోజు రమ్మనటం భావ్యం కాదని దేవినేని ఉమా వ్యాఖ్యానించారు.
ఇదీ చదవండి: ఉక్రెయిన్లో ఉన్నాం.. కాపాడండి సార్!