ETV Bharat / state

విద్యార్థుల హాజరు శాతం తగ్గుదలపై విద్యాశాఖ సర్వే

author img

By

Published : Nov 11, 2020, 10:39 PM IST

పాఠశాలల్లో విద్యార్థుల హాజరు తగ్గుదలపై సర్వే చేపట్టాలని విద్యాశాఖ నిర్ణయించింది. ఈ నెల 2 నుంచి పాఠశాలలు పున:ప్రారంభమవ్వగా విద్యార్థుల హాజరు శాతం తక్కువగా ఉందని గుర్తించారు.

విద్యార్థుల హాజరు శాతం తగ్గుదలపై సర్వే చేపట్టనున్న విద్యాశాఖ
విద్యార్థుల హాజరు శాతం తగ్గుదలపై సర్వే చేపట్టనున్న విద్యాశాఖ


పాఠశాలల్లో విద్యార్థుల హాజరు శాతం తగ్గుదలపై సర్వే చేపట్టాలని విద్యాశాఖ నిర్ణయించింది. రాష్ట్రంలో పాఠశాలలు పున:ప్రారంభమైనప్పటి నుంచి హాజరు శాతం తక్కువగా ఉందని గుర్తించారు. ఇందుకు గల కారణాలపై సర్వే నిర్వహించాలని నిర్ణయించినట్లు రాష్ట్ర విద్యా శిక్షణ కేంద్రం డైరక్టర్ ప్రతాప్ రెడ్డి తెలిపారు. ఐఏఎస్​ఈ, సీటీఈ, డైట్ ప్రిన్సిపల్స్ కలిపి మెుత్తం పది మందిని సమాచార సేకరణ కోసం పంపనున్నారు.

ప్రతి ఒక్కరూ వేరువేరు గ్రామాల్లో ఉన్న 3 ఉన్నత పాఠశాలలను సందర్శించనున్నారు. బృందం సందర్శించే పాఠశాలల్లో రెండు జిల్లా పరిషత్, లేదా ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు, ఒక ప్రైవేట్ పాఠశాల ఉండాలని సూచించారు. ఈ సర్వే సమాచారం 12వ తేదీలోగా పూర్తి కావాలని ఆదేశించారు.


పాఠశాలల్లో విద్యార్థుల హాజరు శాతం తగ్గుదలపై సర్వే చేపట్టాలని విద్యాశాఖ నిర్ణయించింది. రాష్ట్రంలో పాఠశాలలు పున:ప్రారంభమైనప్పటి నుంచి హాజరు శాతం తక్కువగా ఉందని గుర్తించారు. ఇందుకు గల కారణాలపై సర్వే నిర్వహించాలని నిర్ణయించినట్లు రాష్ట్ర విద్యా శిక్షణ కేంద్రం డైరక్టర్ ప్రతాప్ రెడ్డి తెలిపారు. ఐఏఎస్​ఈ, సీటీఈ, డైట్ ప్రిన్సిపల్స్ కలిపి మెుత్తం పది మందిని సమాచార సేకరణ కోసం పంపనున్నారు.

ప్రతి ఒక్కరూ వేరువేరు గ్రామాల్లో ఉన్న 3 ఉన్నత పాఠశాలలను సందర్శించనున్నారు. బృందం సందర్శించే పాఠశాలల్లో రెండు జిల్లా పరిషత్, లేదా ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు, ఒక ప్రైవేట్ పాఠశాల ఉండాలని సూచించారు. ఈ సర్వే సమాచారం 12వ తేదీలోగా పూర్తి కావాలని ఆదేశించారు.

ఇదీచదవండి

రాష్ట్రంపై తగ్గుతున్న కొవిడ్ ప్రభావం.. తాజాగా 1732 కేసులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.