కృష్ణా జిల్లా మచిలీపట్నంలో కొత్తగా మరో రెండు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. పట్టణంలోని గాంధీనగర్ ప్రాంతానికి చెందిన దంపతులకు కరోనా లక్షణాలు కనిపించటంతో వారి నమూనాలను ప్రయోగశాలకు పంపించారు. వీరికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ కావటంతో విజయవాడ కొవిడ్ ఆసుపత్రికి తరలించామని మచిలీపట్నం ఆర్డీఓ ఖాజావలి తెలిపారు. పట్టణంలో మొత్తం ఆరు కరోనా కేసులు నమోదు కాగా... ఒకరు మృతి చెందారు.
ఇదీచదవండి.