ETV Bharat / state

'వెనకబడిన వర్గాల వారికి కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది' - వైకాపా ప్రభుత్వంపై శైలజానాథ్ విమర్శలు

వైకాపా ప్రభుత్వం హయాంలో వెనకబడిన వర్గాల వారిపై దాడులు పెరిగిపోయాయంటూ కాంగ్రెస్ నేత శైలజానాథ్ ఆరోపించారు. వారికోసం మేధావులు, ప్రజాస్వామ్య వాదులు పోరాడాల్సిన అవసరం ఉందన్నారు. వెనకబడిన వర్గాల వారికి కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.

congress leader sailajanath criticises ycp government
శైలజానాథ్, కాంగ్రెస్ నేత
author img

By

Published : Aug 5, 2020, 3:12 PM IST

రాష్ట్రంలో వెనకబడిన వర్గాలు, ఆదివాసీలపై అధికార పార్టీ నాయకులు దాడులకు దిగుతున్నారని ఏపీసీసీ అధ్యక్షులు శైలజానాథ్ ఆరోపించారు. ఇళ్లపట్టాల పేరుతో భూములు లాక్కోవడం వంటి చర్యలతో వారిని వేధిస్తున్నారని మండిపడ్డారు. వారికోసం మేధావులు, ప్రజాస్వామ్య వాదులు పోరాడాల్సిన అవసరం ఉందన్నారు. వెనకబడిన వర్గాల వారికి అండగా కాంగ్రెస్ పార్టీ ఉంటుందని భరోసా ఇచ్చారు.

ఈ విధంగా జరుగుతుంటే పోలీసులు ఏం చేస్తున్నారంటూ ప్రశ్నించారు. ప్రశ్నిస్తే జైలుకు పంపడం, దాడులు చేయడం జగన్మోహన్ రెడ్డి హయాంలో నిత్యకృత్యంగా మారాయంటూ విమర్శించారు. వెనకబడిన వర్గాల హక్కుల కోసం అందరం కలిసి పోరాడాల్సిన సమయం ఆసన్నమైందన్నారు.

రాష్ట్రంలో వెనకబడిన వర్గాలు, ఆదివాసీలపై అధికార పార్టీ నాయకులు దాడులకు దిగుతున్నారని ఏపీసీసీ అధ్యక్షులు శైలజానాథ్ ఆరోపించారు. ఇళ్లపట్టాల పేరుతో భూములు లాక్కోవడం వంటి చర్యలతో వారిని వేధిస్తున్నారని మండిపడ్డారు. వారికోసం మేధావులు, ప్రజాస్వామ్య వాదులు పోరాడాల్సిన అవసరం ఉందన్నారు. వెనకబడిన వర్గాల వారికి అండగా కాంగ్రెస్ పార్టీ ఉంటుందని భరోసా ఇచ్చారు.

ఈ విధంగా జరుగుతుంటే పోలీసులు ఏం చేస్తున్నారంటూ ప్రశ్నించారు. ప్రశ్నిస్తే జైలుకు పంపడం, దాడులు చేయడం జగన్మోహన్ రెడ్డి హయాంలో నిత్యకృత్యంగా మారాయంటూ విమర్శించారు. వెనకబడిన వర్గాల హక్కుల కోసం అందరం కలిసి పోరాడాల్సిన సమయం ఆసన్నమైందన్నారు.

ఇవీ చదవండి..

ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలతో సీఎం అబాసుపాలు: చినరాజప్ప

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.