ETV Bharat / state

విజయవాడ దుర్గగుడికి భారత్​ బయోటెక్​ రూ. కోటి విరాళం

Bharat Biotech Donates Rs 1 Crore to Durga temple: విజయవాడ దుర్గ గుడిలో నిత్యాన్నదాన పథకానికి భారత్‌ బయోటెక్‌ సంస్థ రూ.కోటి విరాళాన్ని అందజేసింది. మూడు దశాబ్దాల్లో నిత్యాన్నదానానికి వచ్చిన విరాళాల్లో ఈ విరాళం అత్యధికం అని ఆలయ ఈవో భ్రమరాంబ తెలిపారు.

author img

By

Published : Apr 2, 2022, 3:53 AM IST

Updated : Apr 2, 2022, 7:22 AM IST

Bharat Biotech donates Rs 1 crore to durga temple
విజయవాడ దుర్గగుడికి భారత్​ బయోటెక్​ రూ. కోటి విరాళం

Bharat Biotech donates Rs 1 crore: విజయవాడ శ్రీ దుర్గామల్లేశ్వరస్వామివార్ల దేవస్థానం నిత్యాన్నదాన పథకానికి భారత్‌ బయోటెక్‌ సంస్థ రూ.కోటి విరాళాన్ని అందజేసింది. ఆన్‌లైన్‌ ఖాతాలో ఆ మొత్తాన్ని జమ చేశారు. ముందుగా భారత్‌ బయోటెక్‌ ప్రతినిధులు దేవస్థానం అధికారులతో సంప్రదించి బ్యాంకు ఖాత నెంబరు తీసుకున్నారు. తరువాత విరాళం మొత్తాన్ని ఆన్‌లైన్​లో బదిలీ చేశారు.

1991లో శ్రీదుర్గామల్లేశ్వరస్వామి వార్ల నిత్యాన్నదాన పథకం రూ.15లక్షలతో ప్రారంభించారు. మూడు దశాబ్దాల్లో నిత్యాన్నదానానికి వచ్చిన విరాళాల్లో భారత్‌ బయోటెక్‌ సంస్థ అందజేసిన విరాళం అత్యధికంగా ఉన్నదని ఈవో భ్రమరాంబ తెలిపారు. ఈవోగా బాధ్యతలు చేపట్టిన ఒక సంవత్సరంలో అన్నదానానికి ప్రస్తుతం వచ్చిన విరాళంతో కలిపి రూ.11 కోట్లు జమచేసినట్లు తెలిపారు. ప్రస్తుతం అన్నదానానికి భక్తులు ఇచ్చిన విరాళాలు రూ.90కోట్లకు చేరినట్లు ఈవో పేర్కొన్నారు.

Bharat Biotech donates Rs 1 crore: విజయవాడ శ్రీ దుర్గామల్లేశ్వరస్వామివార్ల దేవస్థానం నిత్యాన్నదాన పథకానికి భారత్‌ బయోటెక్‌ సంస్థ రూ.కోటి విరాళాన్ని అందజేసింది. ఆన్‌లైన్‌ ఖాతాలో ఆ మొత్తాన్ని జమ చేశారు. ముందుగా భారత్‌ బయోటెక్‌ ప్రతినిధులు దేవస్థానం అధికారులతో సంప్రదించి బ్యాంకు ఖాత నెంబరు తీసుకున్నారు. తరువాత విరాళం మొత్తాన్ని ఆన్‌లైన్​లో బదిలీ చేశారు.

1991లో శ్రీదుర్గామల్లేశ్వరస్వామి వార్ల నిత్యాన్నదాన పథకం రూ.15లక్షలతో ప్రారంభించారు. మూడు దశాబ్దాల్లో నిత్యాన్నదానానికి వచ్చిన విరాళాల్లో భారత్‌ బయోటెక్‌ సంస్థ అందజేసిన విరాళం అత్యధికంగా ఉన్నదని ఈవో భ్రమరాంబ తెలిపారు. ఈవోగా బాధ్యతలు చేపట్టిన ఒక సంవత్సరంలో అన్నదానానికి ప్రస్తుతం వచ్చిన విరాళంతో కలిపి రూ.11 కోట్లు జమచేసినట్లు తెలిపారు. ప్రస్తుతం అన్నదానానికి భక్తులు ఇచ్చిన విరాళాలు రూ.90కోట్లకు చేరినట్లు ఈవో పేర్కొన్నారు.

ఇదీ చదవండి: 'ప్రజాస్వామ్యంపై ఆధిపత్యం చలాయించాలని చూడొద్దు'

Last Updated : Apr 2, 2022, 7:22 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.