ETV Bharat / state

సూర్యలంక తీరంలో మిలిటరీ శిక్షణకు సర్కార్ అనుమతి

author img

By

Published : Oct 12, 2020, 11:07 PM IST

గుంటూరు జిల్లాలోని సూర్యలంక తీరంలో నవంబరు 23 నుంచి డిసెంబరు 4 వరకు మిలిటరీ శిక్షణా కార్యక్రమాలు జరగనున్నాయి. సముద్రం వైపు శతఘ్నులతో కాల్పుల శిక్షణకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. శిక్షణలో 6 నుంచి 8 యుద్ధవిమానాలు పాల్గొంటాయని ప్రభుత్వం వెల్లడించింది. ఈ క్రమంలో సూర్యలంక ఎయిర్‌ఫోర్స్ స్టేషన్ పరిధిలో 100 కిలోమీటర్ల వరకు నిషేధిత జోన్‌గా ప్రకటించింది.

suryalanka beach
suryalanka beach

గుంటూరు జిల్లా సూర్యలంక తీరంలో సైన్యం శిక్షణా కార్యక్రమాలకు అనుమతి ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఏడాది నవంబరు 23 తేదీ నుంచి డిసెంబరు 4 తేదీ వరకూ గుంటూరు జిల్లా సూర్యలంకలో మిలటరీ శిక్షణా కార్యక్రమాలు నిర్వహించనున్నట్టు వెల్లడించింది. సముద్రం వైపునకు శతఘ్నులతో కాల్పుల శిక్షణకు అనుమతి మంజూరు చేస్తూ సాధారణ పరిపాలశాఖ కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్ ఆదేశాలు జారీ చేశారు.

సూర్యలంకలోని ఎయిర్​ఫోర్స్ స్టేషన్ సమీపంలో మిలటరీ శిక్షణా కార్యక్రమాలు నిర్వహించనున్నట్టు వెల్లడించారు. శిక్షణలో భాగంగా 6 నుంచి 8 యుద్ధ విమానాలు పాల్గొంటాయని ప్రభుత్వం పేర్కొంది. ఈ క్రమంలో సూర్యలంక ఎయిర్ ఫోర్స్​ స్టేషన్ పరిధిలోని 100 కిలోమీటర్ల వరకూ నిషేధిత జోన్​గా నిబంధనలు అమల్లో ఉంటాయని.. రాకపోకలు, సముద్రంలో చేపలవేట నిషేధమని ప్రభుత్వం స్పష్టం చేసింది. అటు వాణిజ్య నౌకలకు కూడా ప్రత్యామ్నాయ మార్గాలను సూచించినట్టు తెలిపింది.

గుంటూరు జిల్లా సూర్యలంక తీరంలో సైన్యం శిక్షణా కార్యక్రమాలకు అనుమతి ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఏడాది నవంబరు 23 తేదీ నుంచి డిసెంబరు 4 తేదీ వరకూ గుంటూరు జిల్లా సూర్యలంకలో మిలటరీ శిక్షణా కార్యక్రమాలు నిర్వహించనున్నట్టు వెల్లడించింది. సముద్రం వైపునకు శతఘ్నులతో కాల్పుల శిక్షణకు అనుమతి మంజూరు చేస్తూ సాధారణ పరిపాలశాఖ కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్ ఆదేశాలు జారీ చేశారు.

సూర్యలంకలోని ఎయిర్​ఫోర్స్ స్టేషన్ సమీపంలో మిలటరీ శిక్షణా కార్యక్రమాలు నిర్వహించనున్నట్టు వెల్లడించారు. శిక్షణలో భాగంగా 6 నుంచి 8 యుద్ధ విమానాలు పాల్గొంటాయని ప్రభుత్వం పేర్కొంది. ఈ క్రమంలో సూర్యలంక ఎయిర్ ఫోర్స్​ స్టేషన్ పరిధిలోని 100 కిలోమీటర్ల వరకూ నిషేధిత జోన్​గా నిబంధనలు అమల్లో ఉంటాయని.. రాకపోకలు, సముద్రంలో చేపలవేట నిషేధమని ప్రభుత్వం స్పష్టం చేసింది. అటు వాణిజ్య నౌకలకు కూడా ప్రత్యామ్నాయ మార్గాలను సూచించినట్టు తెలిపింది.

ఇదీ చదవండి:

విజయవాడ శివార్లలో జలపాతాల సవ్వడి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.