రాష్ట్రంలో స్థానిక ఎన్నికల తొలి దశ పోలింగ్ ప్రారంభమైంది. కృష్ణా జిల్లా మైలవరం మండలంలోని చండ్రగూడెంలో అధికార పార్టీ సర్పంచ్ అభ్యర్థి ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారు. ఓటర్లకు బిర్యాని పంచుతూ.. నిబంధనలను అతిక్రమించారు.
ఓటింగ్ రోజున సర్పంచ్ అభ్యర్థి బిర్యానీ పంచడం పట్ల పలువురు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ తరహా చర్యలు ఎన్నికల నియమావళికి విరుద్దమని పేర్కొన్నారు. సదరు అభ్యర్థిపై చర్యలు తీసుకోవాలని అధికారులను డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి: గుండెపోటుతో గరికపాడు పోలింగ్ బూత్ ఏజెంట్ మృతి