కృష్ణా జిల్లా కంచికచర్లలోని ఓ పెళ్లి వేడుకలో రాజధాని రైతులు తమ నిరసనలు తెలియజేశారు. మల్లెల వారి వివాహ వేడుకలో జై అమరావతి, మూడు రాజధానులు వద్దు.. అమరావతే ముద్దు అంటూ నినాదాలు చేశారు. రాజధానిపై తమ వైఖరిని పెళ్లిలో సైతం తెలియజేయడంతో వరుడు సురేష్.. వధువు దేదీప్య సైతం రాజధానికి మద్దతు తెలిపారు. వధూవరులను రాజధాని రైతులు ఆశీర్వదించారు.
ఇదీ చదవండి: 'మూడు రాజధానుల ప్రతిపాదనను అడ్డుకోండి'