ETV Bharat / state

కాకినాడలో ఘోర ప్రమాదం - ట్రాక్టర్​ను ఢీకొట్టిన బైక్​, ముగ్గురు మృతి

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 13, 2023, 3:38 PM IST

Updated : Nov 13, 2023, 5:34 PM IST

Road accident 3 dead
Road accident 3 dead

15:36 November 13

ప్రమాదంలో ముగ్గురు మృతి, మరొకరికి తీవ్రగాయాలు

Road Accident in Kakinada: కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం లచ్చిపాలెం గ్రామం వద్ద జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదంలో చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ముగ్గురు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో యువకుడికి తీవ్ర గాయాలవగా మెరుగైన చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. మృతులు తాళ్ళరేవు మండలం రచ్చవారి పేటకు చెందిన ఓలేటి శ్రీను, పోలేటి రాజు, ఐ పోలవరం మండలం ఎదురులంక గ్రామానికి చెందిన పాలెపు ప్రసాద్ గా గుర్తించారు.

వీరంతా ఒకే ద్విచక్ర వాహనంపై యానం నుంచి తాళ్ళరేవు వెళ్తున్నారు. ముందున్న ఇటుకల ట్రాక్టర్ ఉన్న విషయాన్ని గమనించలేదు. నేరుగా వెళ్లి ఇటుకల ట్రాక్టర్​ను బలంగా ఢీకొట్టడంతో... యువకులు రోడ్డుపై చెల్లా చెదురుగా పడిపోయారు. తీవ్ర గాయాలతో ఘటన జరిగన ప్రదేశంలో మృతి చెందగా.. మరో యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. గాయపడిన యువకుడిని తాళ్ళరేవు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వీరంతా పెయింటింగ్ పనులు చేసుకుంటూ కుటుంబానికి అండగా ఉంటున్నారని పోలీసులు తెలిపారు. రోడ్డు ప్రమాదంపై కోరింగ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. యువకుల మృతి విషయం తెలిసిన కుటుంబ సభ్యులు ఘటన ప్రదేశానికి చేరుకున్నారు. విగత జీవులుగా పడి ఉన్న యువకులను చూసి కన్నీరు మున్నీరయ్యారు.

15:36 November 13

ప్రమాదంలో ముగ్గురు మృతి, మరొకరికి తీవ్రగాయాలు

Road Accident in Kakinada: కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం లచ్చిపాలెం గ్రామం వద్ద జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదంలో చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ముగ్గురు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో యువకుడికి తీవ్ర గాయాలవగా మెరుగైన చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. మృతులు తాళ్ళరేవు మండలం రచ్చవారి పేటకు చెందిన ఓలేటి శ్రీను, పోలేటి రాజు, ఐ పోలవరం మండలం ఎదురులంక గ్రామానికి చెందిన పాలెపు ప్రసాద్ గా గుర్తించారు.

వీరంతా ఒకే ద్విచక్ర వాహనంపై యానం నుంచి తాళ్ళరేవు వెళ్తున్నారు. ముందున్న ఇటుకల ట్రాక్టర్ ఉన్న విషయాన్ని గమనించలేదు. నేరుగా వెళ్లి ఇటుకల ట్రాక్టర్​ను బలంగా ఢీకొట్టడంతో... యువకులు రోడ్డుపై చెల్లా చెదురుగా పడిపోయారు. తీవ్ర గాయాలతో ఘటన జరిగన ప్రదేశంలో మృతి చెందగా.. మరో యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. గాయపడిన యువకుడిని తాళ్ళరేవు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వీరంతా పెయింటింగ్ పనులు చేసుకుంటూ కుటుంబానికి అండగా ఉంటున్నారని పోలీసులు తెలిపారు. రోడ్డు ప్రమాదంపై కోరింగ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. యువకుల మృతి విషయం తెలిసిన కుటుంబ సభ్యులు ఘటన ప్రదేశానికి చేరుకున్నారు. విగత జీవులుగా పడి ఉన్న యువకులను చూసి కన్నీరు మున్నీరయ్యారు.

Last Updated : Nov 13, 2023, 5:34 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.