ETV Bharat / state

SUCIDE: యువతి ఆత్మహత్య.. ప్రేమ వ్యవహారమే కారణమా?

author img

By

Published : Aug 4, 2021, 10:04 PM IST

యువతి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న ఘటన గుంటూరు జిల్లాలో జరిగింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆత్మహత్యే కారణమని భావిస్తున్నారు.

యువతి ఆత్మహత్య
యువతి ఆత్మహత్య

గుంటూరు జిల్లా ఈపూరు మండలానికి చెందిన ఓ యువతి.. పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. కొచ్చర్ల తండాకు చెందిన ఆ యువతి వినుకొండలోని ఓ ప్రైవేట్ డిగ్రీ కళాశాల విద్యార్థిని. అదే కళాశాలలో చదువుకుంటున్న గంగుపల్లి తండాకు చెందిన మేరాజోత్ అంజినాయక్​, ఆ యువతి కొన్ని సంవత్సరాలుగా ప్రేమించుకున్నారు. ఈ క్రమంలో యువతి తనను పెళ్లి చేసుకోవాలని అంజినాయక్ పై ఒత్తిడి చేసింది.

ఆదివారం వారిద్దరు కొటప్పకొండకు వెళ్లారు. అక్కడ ఏం జరిగిందో తెలియదు గానీ.. సాయంత్రం 6 గంటల సమయంలో యువతి పురుగుల మందు తాగింది. గమనించిన బంధువులు, వినుకొండలోని ప్రైవేట్ వైద్యశాలకు తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం నరసరావుపేటకు తరలించారు. చికిత్స పొందుతూ బుధవారం తెల్లవారుజామున మృతిచెందింది. కుటుంబీకుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఈపూరు పోలీసులు తెలిపారు.

గుంటూరు జిల్లా ఈపూరు మండలానికి చెందిన ఓ యువతి.. పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. కొచ్చర్ల తండాకు చెందిన ఆ యువతి వినుకొండలోని ఓ ప్రైవేట్ డిగ్రీ కళాశాల విద్యార్థిని. అదే కళాశాలలో చదువుకుంటున్న గంగుపల్లి తండాకు చెందిన మేరాజోత్ అంజినాయక్​, ఆ యువతి కొన్ని సంవత్సరాలుగా ప్రేమించుకున్నారు. ఈ క్రమంలో యువతి తనను పెళ్లి చేసుకోవాలని అంజినాయక్ పై ఒత్తిడి చేసింది.

ఆదివారం వారిద్దరు కొటప్పకొండకు వెళ్లారు. అక్కడ ఏం జరిగిందో తెలియదు గానీ.. సాయంత్రం 6 గంటల సమయంలో యువతి పురుగుల మందు తాగింది. గమనించిన బంధువులు, వినుకొండలోని ప్రైవేట్ వైద్యశాలకు తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం నరసరావుపేటకు తరలించారు. చికిత్స పొందుతూ బుధవారం తెల్లవారుజామున మృతిచెందింది. కుటుంబీకుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఈపూరు పోలీసులు తెలిపారు.

ఇదీ చదవండి:

Jagananna Pacha Toranam: రేపే జగనన్న పచ్చతోరణం ప్రారంభం.. తొలిమొక్క నాటనున్న సీఎం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.