గుంటూరు జిల్లా క్రోసూరు వ్యవసాయ మార్కెట్ యార్డ్ ప్రాంగణంలో శుక్రవారం రాత్రి స్థానిక వైకాపా నేతలు రెచ్చిపోయారు. రికార్డింగ్ డాన్సులతో హోరెత్తించారు. నిబంధనలు అతిక్రమించి.. వ్యవసాయ మార్కెట్ యార్డులో స్థానిక వైకాపా నాయకుడు షేక్ గనీ పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు. ఇందులో పాల్గొన్న పార్టీ నాయకుల్లో కొందరు.. డ్యాన్సర్లతో కలిసి చిందులేశారు.
రికార్డింగ్ డ్యాన్స్లకు వ్యవసాయ మార్కెట్ యార్డును ఉపయోగించటంపై స్థానికులు మండిపడుతున్నారు. విందు, వినోదాలు, రికార్డింగ్ డ్సాన్సులతో చిందులేస్తున్నా.. అధికార పార్టీ నాయకులనే కారణంతో పోలీసులు, అధికారులు పట్టించుకోకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఇదీ చదవండి: