గుంటూరు జిల్లా కాకుమాను మండలం కొమ్మూరులో కాళీ, భద్రకాళీ సమేత ఉద్దండ వీరభద్రస్వామి కల్యాణం ఘనంగా జరిగింది. ఈ వేడుకలో పలువురు దంపతులు పాల్గొన్నారు. ఆలయ వార్షికోత్సవంలో భాగంగా.. స్వామివారికి పంచామృతాభిషేకాలు జరిపారు. పసుపు, కుంకుమ, విభూదిలతో అభిషేకం నిర్వహించి ఆనకట్టు కట్టారు. వినాయకుడు, శివుడు, సాయిబాబా, కాళీ వేషధారణలతో రాత్రికి కళాకారులు నృత్య ప్రదర్శన ఇవ్వనున్నారు.
ఇదీ చదవండి:
'రాజకీయ కక్ష సాధింపుల్లో భాగంగానే తెదేపా వర్గీయుల ఆస్తులపై దాడులు'