ETV Bharat / state

మద్యం మత్తులో ప్రమాదం.. ఇద్దరికి గాయాలు - నాదెండ్ల రోడ్డు ప్రమాదం తాజా వార్తలు

గుంటూరు జిల్లా నాదెండ్ల మండలం గణపవరం వద్ద ప్రమాదం జరిగింది. గణపవరంలో మద్యం తాగిన వ్యక్తి వాహనం నడుపుతూ.. ఎదురుగా వస్తున్న ఐస్​క్రీం బండిని ఢీకొట్టిన ఘటనలో ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారు. వారిద్దరిని గుంటూరు జీజీహెచ్​కు తరలించి చికిత్స అందిస్తున్నారు.

two injured in accident occured at nadendla in guntur district
మద్యం మత్తులో ప్రమాదం.. ఇద్దరికి గాయాలు
author img

By

Published : Feb 20, 2021, 9:36 AM IST

గుంటూరు జిల్లా నాదెండ్ల మండలం గణపవరంలో మద్యం తాగిన వ్యక్తి వాహనంపై వెళ్తూ.. ఐస్​క్రీం బండిని ఢీకొట్టాడు. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారు. ఉత్తర్​​ప్రదేశ్​కు చెందిన యువకుడు గోపి.. ఐస్​క్రీం అమ్ముకుంటూ చిలకలూరిపేట పట్టణంలోని పోలిరెడ్డిపాలెంలో నివాసం ఉంటున్నాడు. ఐస్​క్రీం బండితో వేలూరు నుంచి గణపవరం ప్రయాణిస్తున్నాడు. పెదనందిపాడు మండలం అన్నపర్రుకి చెందిన డేనియలు.. మద్యం తాగి ద్విచక్ర వాహనంపై వేలూరు వైపు వెళుతున్నాడు.

two injured in accident occured at nadendla in guntur district
గోపికి చికిత్స అందిస్తున్న 108సిబ్బంది

వాహనం అదుపుతప్పి ఐస్​క్రీం బండిని డేనియలు ఢీకొన్నాడు. ఈ ఘటనలో.. అతనితో పాటు.. ఐస్ క్రీం బండిపై ఉన్న వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు. వారిద్దరికీ చిలకలూరిపేట 108 సిబ్బంది సకాలంలో ప్రథమ చికిత్స అందించడంతో ప్రాణాపాయం తప్పింది. వీరిని తొలుత చిలకలూరిపేట ప్రభుత్వ వైద్యశాలలో చేర్పించారు. వైద్యుల సిఫార్సుతో మెరుగైన చికిత్స కోసం అక్కడి నుంచి గుంటూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై తమకెలాంటి ఫిర్యాదు అందలేదని నాదెండ్ల పోలీసులు తెలిపారు.

ఇదీ చదవండి:

జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో దౌర్జన్యాలపై ఫిర్యాదుల వెల్లువ

గుంటూరు జిల్లా నాదెండ్ల మండలం గణపవరంలో మద్యం తాగిన వ్యక్తి వాహనంపై వెళ్తూ.. ఐస్​క్రీం బండిని ఢీకొట్టాడు. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారు. ఉత్తర్​​ప్రదేశ్​కు చెందిన యువకుడు గోపి.. ఐస్​క్రీం అమ్ముకుంటూ చిలకలూరిపేట పట్టణంలోని పోలిరెడ్డిపాలెంలో నివాసం ఉంటున్నాడు. ఐస్​క్రీం బండితో వేలూరు నుంచి గణపవరం ప్రయాణిస్తున్నాడు. పెదనందిపాడు మండలం అన్నపర్రుకి చెందిన డేనియలు.. మద్యం తాగి ద్విచక్ర వాహనంపై వేలూరు వైపు వెళుతున్నాడు.

two injured in accident occured at nadendla in guntur district
గోపికి చికిత్స అందిస్తున్న 108సిబ్బంది

వాహనం అదుపుతప్పి ఐస్​క్రీం బండిని డేనియలు ఢీకొన్నాడు. ఈ ఘటనలో.. అతనితో పాటు.. ఐస్ క్రీం బండిపై ఉన్న వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు. వారిద్దరికీ చిలకలూరిపేట 108 సిబ్బంది సకాలంలో ప్రథమ చికిత్స అందించడంతో ప్రాణాపాయం తప్పింది. వీరిని తొలుత చిలకలూరిపేట ప్రభుత్వ వైద్యశాలలో చేర్పించారు. వైద్యుల సిఫార్సుతో మెరుగైన చికిత్స కోసం అక్కడి నుంచి గుంటూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై తమకెలాంటి ఫిర్యాదు అందలేదని నాదెండ్ల పోలీసులు తెలిపారు.

ఇదీ చదవండి:

జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో దౌర్జన్యాలపై ఫిర్యాదుల వెల్లువ

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.